Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

గణశుని పుట్టుక

సూత ఉవాచ |

తారకారేరితి శ్రుత్వా వృత్తమద్భుతముత్తమమ్‌ | నారదస్సుప్రసన్నో%థ పప్రచ్ఛ ప్రీతితో విధిమ్‌ || 1

సూతుడిట్లు పలికెను -

తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత, ఉత్తమ వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై బ్రహ్మాను ప్రేమతో ఇట్లు ప్రశ్నించెను (1).

నారద ఉవాచ |

దేవ దేవ ప్రజానాథ శివజ్ఞాననిధే మయా | శ్రుతం కార్తిక సద్వృత్త మమృతాదపి చోత్తమమ్‌ || 2

అధునా శ్రోతుమిచ్ఛామి గాణశం వృత్తముత్తమమ్‌ | తజ్జన్మ చరితం దివ్యం సర్వమంగలమంగలమ్‌ || 3

నారదుడిట్లు పలికెను -

దేవదేవా! ప్రజానాతా! నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము కంటె గొప్పది, పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని (2). ఇపుడు గణశుని ఉత్తమ చిరిత్రను, దివ్యము మంగలములలోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ వృత్తాంతమును వినగోరు చున్నాను (3).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య నారదస్య మహామునేః | ప్రసన్న మానసో బ్రహ్మా ప్రత్యువాచ శివం స్మరన్‌ || 4

సూతుడిట్లు పలికెను -

మహాముని యగు ఆ నారదుని ఈ మాటను విని బ్రహ్మ ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇట్లు బదులిడెను (4).

బ్రహ్మోవాచ |

కల్పభేదాద్గణశస్య జనిః ప్రోక్తా విధేః పురా | శనిదృష్టం శిరశ్ఛిన్నం సంచితం గజమాననమ్‌ || 5

ఇదానీం శ్వేతకల్పోక్తా గణశోత్పత్తి రుచ్యతే | యత్ర చ్ఛిన్నం శిరస్తస్య శివేన చ కృపాలునా || 6

సందేహో నాత్ర కర్తవ్య శ్శంకరస్సూతికృన్మునే|సహి సర్వాదిపశ్శంభుర్నిర్గుణస్సగుణో%పి హి || 7

తల్లీలయాఖిలం విశ్వం సృజ్యతే పాల్యతే తథా | వినాశ్యతే మునిశ్రేష్ఠ ప్రస్తుతం శృణు చాదరాత్‌ || 8

బ్రహ్మ ఇట్లు పలికెన -

గణశుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా చెప్పయుంటిని. గణశుడు పుట్టుట, శని చూచుటచే ఆతని శిరస్సు భగ్నమగుట, ఏనుగు తలను అతికించుట అను గాథను చెప్పితిని. ఆ గాథ మరియొక కల్పమునకు సంబంధించినది (5). ఇపుడు శ్వేత వరాహకల్పమునకు సంబంధించిన గణశుని పుట్టుక చెప్పబడు చున్నది. ఈ గాథలో దయాళువు అగు శివుడు ఆతని శిరస్సును నరుకును (6). ఓ మునీ! ఈ విషయములో నీవు సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలలను చేయును ఆ శంభుడు సర్వేశ్వరుడు. నిర్గుణుడే అయిననూ సగుణుడు కూడా (7). ఓ మహర్షీ! ఆయన లీలచేతనే జగత్తు సృజించబడి, పాలించబడి, సంహరింపబడు చున్నది. ప్రస్తుత గాథాను శ్రద్ధగా వినుము (8).

ఉద్వాహితే శివే చాత్ర కైలాసం చ గతే సతి | కియతా చైవ కాలేన జాతో గణపతేర్భవః || 9

ఏకస్మిన్నేవ కాలే చ జయా చ విజయా సఖీ | పార్వత్యా చ మిలిత్వావై విచారే తత్పరాభవత్‌ || 10

రుద్రస్య చ గణాస్సర్వే శివస్యాజ్ఞాపరాయణాః | తే సర్వే%ప్యస్మదీయాశ్చ నంది భృంగి పురస్సరాః || 11

ప్రమథాస్తే హ్యసంఖ్యాతా అస్మదీయో న కశ్చన | ద్వారి తిష్ఠంతి తే సర్వే శంకరాజ్ఞా పరాయణాః || 12

తే సర్వేప్యస్మదీయాశ్చ తథాపి న మిలేన్మనః | ఏకశ్చైవాస్మదీయో హి రచనీయస్త్వయానఘే || 13

శివుడు వివాహమాడి కైలాసమునకు వెళ్లిన కొంత కాలమునకు గణపతి జన్మించెను (9). ఒక సమయములో జయ, విజయ అను సఖురాండ్రు పార్వతిని కలిసిరి. ఆమె వరితో చర్చించమొదలిడెను (10). రుద్రుని గణములన్నియు మంగళకరుడగు ఆయన ఆజ్ఞను పాలించుచుందురు. వారిలో నంది, భృంగి మొదలగు వారు మనవారే (11). కాని ప్రమథులు లెక్కలేనంత మంది గలరు. వారిలో మనవాడు ఒక్కడైననూ లేడు. వారందరు శంకరుని ఆజ్ఞనుపాలిస్తూ ద్వారమునందు నిలబడి యుందురు (12). వారందరు మన వారే అయినా వారితోమనస్సు కలియుట లేదు. ఓ పుణ్యాత్మురాలా! నీవు మన వానిని ఒకనిని ద్వారము వద్ద ఏర్పాటు చేయవలెను (13).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్తా పార్వతీ దేవీ సఖీభ్యాం సుందరం వచః | హితం మేనే తదా తచ్చ కుర్తుం స్మాప్యద్యవస్యతి || 14

తతః కదాచిన్మజ్జత్యాం పార్వత్యాం వై సదాశివః | నందినం పరిభర్త్స్యాథ హ్యాజగామ గృహాంతరమ్‌ || 15

ఆయాంతం శంకరం దృష్ట్వా%సమయే జగదంబికా | ఉత్తస్థౌ మజ్జతీ సా వై లజ్జితా సందరీ తదా || 16

తస్మిన్నవసరే దేవీ కౌతుకేనాతి సంయుతా | తదీయం తద్వచశ్చైవ హితం మేనే సుఖావహమ్‌ || 17

బ్రహ్మ ఇట్లు పలిలెను -

సఖురాండ్రిద్దరు పలికిన ఈ సుందరమగు మాటను విని పార్వతీ దేవి అదియే హితమని భావించి అట్లు చేయుటకు నిశ్చయించెను (14). తరువాత ఒకనాడు పార్వతి స్నానమాడు చుండగా సదా శివుడు ద్వారపాలకుడగు నందిని గద్దించి ఇంటిలోపలికి వచ్చెన (15). సమయము కాని సమయములో విచ్చేసిన శంకరుని చూచి జగన్మాతయగు ఆ సుందరి స్నానము చేయుచున్నదై సిగ్గుపడి లేచి నాలబడెన (16). ఆ సమయములో మిక్కిలి ఉత్కంఠను పొందిన పార్వతీ దేవి సఖురాండ్ర వచనము హితమును సుఖమును కలిగించునది యని తలపోసెను (17).

ఏవం జాతే సదా కాలే కదాచిత్పార్వతీ శివా | విచింత్య మనసా చేతి పరమా యా పరేశ్వరీ || 18

మదీయస్సేవకః కశ్చిద్భవేచ్ఛుభతరః కృతీ | మదాజ్ఞయా పరం నాన్యద్రేఖామాత్రం చలేదిహ || 19

విచార్యేతి చ సా దేవీ వపుషో మలసంభవమ్‌ | పురుషం నిర్మ మౌ సా తు సర్వలక్షణ సంయుతమ్‌ || 20

సర్వావయవనిర్దోషం సర్వావయవసుందరమ్‌ | విశాలం సర్వశోభాఢ్యం మహాబలపరాక్రమమ్‌ || 21

ఇట్లు జరుగగా ఒకప్పుడు శివపత్నియగు పార్వతీ దేవి మనస్సులో ఆలోచించెను. సర్వోత్కృష్టురాలగు ఆ పరమేశ్వరి మనస్సులో ఇట్లు తలపోసెను (18). సమర్థుడగు నా వ్యక్తి ఒకడు సేవకుడుగా నున్నచో చాల బాగుండును. అట్టి వ్యక్తి నా ఆజ్ఞను ఇసుమంతైననూ జవదాటకుండగా పాలించగలడు (19). ఆ దేవి ఇట్లు విచారించి తన శరీరమునుండి రాలిన నలుగుడు పిండితో లక్షణములన్నింటితో కూడిన పురుషుని నిర్మించెను (20). ఆతని అవయవములలో దోషమేమియూ లేకుండెను. అవయవములన్నయూ సుందరముగా నుండెను. సమర్థుడు, సర్వశోభలతో నిండియున్నవాడు అగు ఆ పురుషుడు మహాబలమును. పరాక్రమమును కలిగియుండెను (21).

వస్త్రాణి చ తదా తసై#్మ దత్త్వా సా వివిధాని హి | నానాలంకరణం చైవ బహ్వాశిషమనుత్తమామ్‌ || 22

మత్పుత్రస్త్వం మదీయో%సి నాన్యః కశ్చిదిహాస్తి మే | ఏవముక్తస్స పురుషో నమస్కృత్య శివాం జగౌ || 23

ఆమె అపుడు ఆ పురుషునకు అనేక వస్త్రములు, అలంకారములను ఇచ్చి సర్వోత్తమమగు అనేక ఆశీర్వచనములను పలికెను (22). నీవు నా పుత్రుడవు. నీవు తక్క నావాడు మరియొకడిచట లేడు. పార్వతీదేవి ఇట్లు పలుకగా ఆ పురుషుడు నమస్కరించి ఇట్లు పలికెను (23).

గణశ ఉవాచ |

కిం కార్యం విద్యతే తే%ద్య కరవాణి తవోదితమ్‌ | ఇత్యుక్తా సా తదా తేన ప్రత్యువాచ సుతం శివా || 24

గణశుడిట్లు పలికెను -

ఇపుడు నీకు చేయదగిన పనియేమి? నీ మాటను నేను నెరవేర్చెదను. ఆ పురుషుని ఈ మాటను విని పార్వతి తన ఆ పుత్రునికి ఇట్లు బదులిడెను (24).

శివోవాచ |

హే తాత శృణు మద్వాక్యం ద్వారపాలో భవాద్యమే | మత్పుత్రస్త్వం మదీయోసి నాన్యథా కశ్చిదస్తి మే || 25

వినా మదాజ్ఞాం మత్పుత్ర నైవాయాన్మద్గృహాంతరమ్‌ | కేపి క్వాపి హఠాత్తాత సత్యమేతన్మయోదితమ్‌ || 26

పార్వతి ఇట్లు పలికెను -

ఓ పుత్రు! నా మాటను వినుము. ఇపుడు నీవు నా ద్వారమును రక్షించుము. నీవు నా పుత్రుడవు గనుక నా వాడవు. నీవు తక్క మరియొకడు నా వాడు లేడు (25). పుత్రా! ఎవ్వరైననూ ఎప్పుడైననూ నా ఆజ్ఞ లేనిదే హఠాత్తుగా నా గృహములోపలికి రారాదు. నేను నీకు సత్యమును చెప్పు చున్నాను (26).

బ్రహ్మోవాచ!

ఇత్యుక్త్వా చ దదౌ తసై#్మ యష్టిం చాతిదృఢాం మునే | తదీయం రూపమాలోక్య సుందరం హర్ష మాగతా || 27

ముఖమాచుంబ్య సుప్రీత్యాలింగ్య తం కీపయా సుతమ్‌ | స్వ ద్వారి స్థఝాపయామాస యష్టిపాణిం గణాదిపమ్‌ || 28

అథ దేవీసుతస్తాత గృమద్వారి స్థితో గణః | యష్టి పాణిర్మహావీరః పార్వతీహితకామ్యయా || 29

స్వద్వారి స్థాపయిత్వా తం గణశం స్వసుతం శివా | స్వయం చ మజ్జతీ సా వై సంస్థితాసీత్సఖీయుతా || 30

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ ! ఆమె ఇట్లు పలికి ఆతనికి మిక్కిలి దృఢమగు కర్రను ఇచ్చెను. ఆమె ఆతని సుందరరూపమును గాంచి ఆనందించెను (27). ఆమె తన కుమారుడగు గణాధిపుని ముఖమును ప్రీతితో ముద్దాడి దయతో ఆలింగనము చేసుకొని చేతికి కర్రనిచ్చి తన ద్వారము నందు నిలబెట్టెను (28). కుమారా! అపుడు మహావీరుడగు దేవీపుత్రుడు పార్వతికి హితమును చేయు కోరికతో కర్రను చేతబట్టి ఇంటి ద్వారము నందు నిలబడెను (29). తన కుమారుడగు గణశుని తన ఇంటి ద్వారము వద్ద నిలబెట్టి ఆ పార్వతీ దేవి సఖురాండ్రతో గూడి స్నానమును చేయుచుండెను (30).

ఏతస్మిన్నేవ కాలే తు శివో ద్వారి సమాగతః | కౌతుకీ ముని శార్దూల నానాలీలా విశారదః || 31

ఉవాచ చ శివేశం తమవిజ్ఞాయ గణాధిపః | మాతురాజ్ఞాం వినా దేవ గమ్యతాం న త్వయాధునా || 32

మజ్జనార్థం స్థితా మాతా క్వ యాసీతో వ్రజాధునా | ఇత్యుక్త్వా యష్టికాం తస్య రోధనాయ తదాగ్రహీత్‌ || 33

తం దృష్ట్వా తు శివః ప్రాహ కం నిషేధసి మూఢధీః | మాం న జానాస్యసద్బుద్ధే శివోహమితి నాన్యథా || 34

ఓ మహర్షీ! ఇంతలోనే అనేక లీలా పండితుడగు శివుడు ఉత్కంఠతో ద్వారము వద్దకు వచ్చెను (31). ఆయన శివప్రభుడని తెలియని గణాధిపుడు ఇట్లనెను : దేవా! తల్లి ఆజ్ఞ లేనిదే నీవిపుడు లోనికి పోరాదు (32). తల్లి స్నానమునకు వెళ్లినది. నీవు ఎచటకు వెళ్లుచుంటివి? ఇట్లు పొమ్ము. ఇట్లు పలికి ఆతడు ఆయనను నిలువరించుటకై చేతిలోనికి కర్రను తీసుకొనెను (33). వానిని చూచి శివుడిట్లు పలికెను : నీవు ఎవరిని అడ్డుచున్నావు? నీవు మూర్ఖబుద్ధివి. ఓరీ దుర్బుద్ధీ! నీవు నన్ను ఎరుంగవా? నేను శివుడను. సందేహము వలదు (34).

తాడితస్తేన యష్ట్వా హి గణశేన మహేశ్వరః | ప్రత్యువాచ స తం పుత్రం బహులీలశ్చ కోపితః || 35

గణశుడు అనేక లీలలను ప్రదర్శించే మహేశ్వరుని కర్రతో కొట్టగా ఆయన కోపించి ఆ పుత్రునితో నిట్లనెను (35).

శివా ఉవాచ |

మూర్ఖోసి త్వం న జతానాసి శివోహం గిరిజాపతి | స్వగృహం యామి రే బాల నిషేదసి కథం హి మామ్‌ || 36

ఇత్యుక్త్వా ప్రవిశంతం తం మహేశం గణనాయకః | క్రోధం కృత్వా తతో విప్ర దండేనాతాడయత్పునః || 37

తతశ్శివశ్చ సంక్రుద్ధో గణానాజ్ఞాపయన్నిజాన్‌ | కో వాయం కర్తతే కిం చ క్రియతే పశ్యతాం గణాః || 38

శివుడిట్లు పలికెను -

నీవు మూర్ఖుడవు. నేను పార్వతీపతియగు శివుడనని యెరుంగవు. ఓరీ బాలకా! నేను నా ఇంటికి వెళ్లుచుండగా నీవు నన్నేల అడ్డుకొనెదవు? (36) ఇట్లు పలికి లోపలకు ప్రవేశించుచున్న ఆ మహేశ్వరుని గణశుడు కోపించి మరల కర్రతో కొట్టెను. ఓ విప్రా! (37). అపుడు శివుడు మిక్కిలి కోపించి తన గణములను ఇట్లు ఆజ్ఞాపించెను: గణములారా! వీడెవడు? ఇక్కడ ఉండి ఏమి చేయుచున్నాడు? చూడుడు (38).

ఇత్యుక్త్వా తు శివస్తత్ర స్థితః క్రుద్ధో గృహాద్బహిః | భవాచారరతస్స్వామీ బహ్వద్భుత సులీలకః || 39

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే గణశోత్పత్తి వర్ణనం నామ త్రయో దశోధ్యాయః (13).

శివుడిట్లు పలికి ఇంటిబయట క్రోధముతో నిలబడి యుండెను. లోకాచారముల నిష్టపడే ఆ ప్రభుడు అనేక అద్భుత లీలలను ప్రదర్శించును (39).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు కుమారఖండలో గణశుని పుట్టుక అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

Sri Sivamahapuranamu-II    Chapters