Sri Sivamahapuranamu-I    Chapters   

అథ ద్వాదశోsధ్యాయః

తీర్థములు - క్షేత్రములు

సూత ఉవాచ |

శృణుధ్వ మృషయః ప్రాజ్ఞా శ్శివక్షేత్రం విముక్తిదమ్‌ | తదాగమాం స్తతో వక్ష్యే లోకరక్షార్థమేవ హి || 1

పంచశత్కోటి విస్తీర్ణా సశైల వన కాననా | శివాజ్ఞయా హి పృథివీ లోకం ధృత్వా చ తిష్ఠతి || 2

తత్ర తత్ర శివక్షేత్రం తత్ర తత్ర నివాసినామ్‌ | మోక్షార్థం కృపయా దేవఃక్షేత్రం కల్పితవాన్‌ ప్రభుః || 3

పరిగ్రహాదృషీణాం చ దేవానాం చ పరిగ్రహాత్‌ | స్వయం భూతాన్యథాన్యాని లోకరక్షార్ధమేవ హి || 4

సూతుడిట్లు పలికెను -

ఓ ప్రాజ్ఞులగు ఋషులారా! నేను మోక్షము నిచ్చే శివక్షేత్రములను తదుపరి శివాగమమును మానవ కల్యాణము కొరకు వివరించెదను వినుడు (1). ఏభై కోట్ల (యోజనమల) విస్తారము కలిగి, పర్వతములతో అడవులతో విలసిల్లే పృథివి శివుని యాజ్ఞచే ప్రాణులను ధరించియున్నది. (2). జగన్నాథుడగు మహాదేవుడు వివిధ ప్రాంతములలో నివసించు జనుల మోక్షము కొరకై ఆయా స్థలములలో పుణ్యక్షేత్రములను నిర్మించెను (3). ఋషులు నివసించుట వలన కొన్ని స్థలములు, దేవతలు అనుగ్రహించుట వలన మరికొన్ని స్థలములు, స్వయం భూలింగముల ఆవిర్భావము వలన ఇంకొన్ని స్థలములు క్షేత్రములై, మానవులకు కల్యాణమును చేయుచున్నవి (4).

తీర్థే క్షేత్రే సదా కార్యం స్నానదాన జపాదికమ్‌ | అన్యథా రోగ దారిద్ర్యమూ కత్వా ద్యాప్నుయాన్నరః || 5

అథాస్మిన్‌ భారతే వర్షే ప్రాప్నోతి మరణం నరః | స్వయం భూస్థాన వాసే న పునర్మానుష్య మాప్నుయాత్‌ || 6

క్షేత్రే పాపస్య కరణం దృఢం భవతి భూసురాః | పుణ్యక్షేత్రే నివాసే హి పాపమణ్వపి నాచరేత్‌ || 7

యేన కేనా ప్యుపాయేన పుణ్యక్షేత్రే వసేన్నరః | సింధోశ్శతనదీ తీరే సంతి క్షేత్రాణ్యనే కశః || 8

పుణ్యక్షేత్రములోని తీర్థము నందు నిత్యము స్నాన, దాన, జపాదులను చేయవలెను. అట్లు చేయని మానవుడు రోగమును, దారిద్ర్యమును, మూగదనము మొదలుగు లోపములను పొందును (5). ఈ భరత ఖండములో స్వయం భూ లింగము గల క్షేత్రములో మరణించిన వ్యక్తికి పునర్జన్మ లేదు (6). ఓ బ్రహ్మణులారా! పుణ్యక్షేత్రములో చేసిన పాపము అధికదోషము నిచ్చును. కావున పుణ్యక్షేత్రములో నివసించు వ్యక్తి లేశ##మైననూ పాపమును చేయరాదు (7). మానవుడు ఏదో ఒక ఉపాయమును చేసి, పుణ్యక్షేత్రమునందు నివసించవలెను.సింధునది ఒడ్డున, శతద్రునది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రములు గలవు (8).

సరస్వతీ నదీ పుణ్యా ప్రోక్తా షష్టిముఖా తథా | తత్తత్తీరే వసే త్ర్పాజ్ఞః క్రమాద్బ్రహ్మ పదం లభేత్‌ || 9

హిమవద్గిరిజా గంగా పుణ్యా శతముఖా నదీ | తత్తీరే చైవ కాశ్యాది పుణ్యక్షేత్రా ణ్యనేకశః || 10

తత్ర తీరం ప్రశస్తం హి మృగే మృగబృహస్పతౌ | శోణ భద్రో దశముఖః పుణ్యోSభీష్ట ఫలప్రదః || 11

తత్ర స్నానో పవాసేన పదం వైనాయకం లభేత్‌ | చతుర్వింశముఖా పుణ్యా నర్మదా చ మహానదీ || 12

అరువది ముఖములు (ధారలు) గల సరస్వతీ నది పవిత్రమైనది. వివేకి ఆయా నదీతీరముల యందు నివసించినచో, క్రమముగా బ్రహ్మలోకమును పొందును (9). పవిత్రమగు గంగానది హిమవత్పర్వతము నుండి పుట్టినది. అది వంద ముఖములు గల నది దాని తీరము నందు కాశీ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు (10). సూర్యుడు మృగరాశి యందుండగా అచట నివాసము ప్రశస్తము. గురువు మృగరాశి యందుండగా శోణ భద్రానది కోరిన ఫలముల నిచ్చును. పవిత్రమగు ఆ నదికి పది ముఖములు గలవు (11).అచట స్నానము చేసి, ఉపవాసమున్నచో, వినాయక పదము లభించును. నర్మద యను మహానది పవిత్రమైనది; ఇరువది నాలుగు ముఖములు గలది (12).

తస్యాం స్నానేన వాసేన పదం వైష్ణవమాప్నుయాత్‌ | తమసా ద్వాదశముఖా రేవా దశముఖా నదీ || 13

గోదావరీ మహా పుణ్యా బ్రహ్మ గోవధనాశినీ | ఏక వింశముఖా ప్రోక్తా రుద్రలోక ప్రదాయినీ || 14

కృష్ణవేణా పుణ్యనదీ సర్వపాపక్షయా వహా | సాష్టా దశముఖా ప్రోక్తా విష్ణులోక ప్రదాయినీ || 15

తుంగభద్రా దశముఖా బ్రహ్మలోక ప్రదాయినీ | సువర్ణముఖరీ పుణ్యా ప్రోక్తా నవముఖా తథా || 16

తత్రైవ సుప్రజాయంతే బ్రహ్మలోక చ్యుతా స్తథా | సరస్వతీ చ పంపా చ కన్యా శ్వేతనదీ శుభా || 17

ఏతాసాం తీరవాసేన ఇంద్రలోక మవాప్నుయాత్‌ |

దాని తీరమునందు నివసించి దాని యందు స్నానము చేసినచో, విష్ణుపదము లభించును. తమసా నదికి పన్నెండు ముఖములు, రేవా నదికి పదిముఖములు గలవు (13). మహా పవిత్రమగు గోదావరీ నది బ్రహ్మహత్యా గోహత్యా దోషములను పోగొట్టును. ఇరవై ఒక్క ముఖములు గల గోదావరి రుద్రపదమును ఇచ్చును (14). పవిత్రమగు కృష్ణవేణి సర్వపాపములను పోగొట్టును. పద్ధెనిమిది ముఖములు గల కృష్ణవేణి విష్ణులోకము నొసంగును (15). పదిముఖములు గల తుంగభద్ర బ్రహ్మలోకము నిచ్చును. పవిత్రమగు సువర్ణముఖీ నదికి తొమ్మిది ముఖములు గలవు (16). బ్రహ్మలోకము నుండి చ్యుతులగు జీవులు సువర్ణముఖీ తీరము నందు జన్మింతురు. సరస్వతీ నది, పంపా సరస్సు, స్వచ్ఛ జలములను కలిగి యుండి మంగళముల నిచ్చు కన్యానది (17). అనే నదుల తీరమున నివసించు వ్యక్తి ఇంద్రలోకమును పొందును.

సహ్యాద్రిజా మహా పుణ్యా కావేరీతి మహానదీ || 18

సప్తవింశ ముఖాప్రోక్తా సర్వాభీష్ట ప్రదాయినీ | తత్తీరాః స్వర్గదాశ్చైవ బ్రహ్మ విష్ణు పదప్రదాః || 19

శివలోక ప్రదాశ్శైవాస్తథాSభీష్ట ఫల ప్రదాః | నైమిషే బదరే స్నాయాన్మేషగే చ గురౌ రవౌ || 20

బ్రహ్మలోక ప్రదం విద్యాత్తతఃపూజాదికం తథా | సింధునద్యాం తథా స్నానం సింహే కర్కటగే రవౌ || 21

కేదారోదకపానం చ స్నానం చ జ్ఞానదం విదుః |

సహ్య పర్వతము నుండి పుట్టిన కావేరి యను గొప్ప నది మిక్కిలి పవిత్రమైనది (18). కోర్కెల నన్నిటినీ తీర్చే కావిరికి ఇరువది యేడు ముఖములు గలవని చెప్పుదురు. దాని తీరములు స్వర్గలోకమును, మరియు బ్రహ్మపదమును, విష్ణుపదమును ఇచ్చును (19). కోరిన ఫలముల నిచ్చి, శివలోకమునిచ్చే శైవక్షేత్రములు కావేరీ తీరమున గలవు. గురువు, సూర్యుడు మేషరాశి యందున్నప్పుడు నైమిషము నందు, బదరి యందు స్నానము చేయవలెను (20). అపుడు సలిపిన పూజాదుల వలన బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. సూర్యుడు సింహరాశి యందు, కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధునదీ స్నానము (21), కేదారస్నానము, కేదారములోని జలమును త్రాగుట చేసినచో, జ్ఞానము కలుగును.

గోదావర్యాం సింహమాసే స్నాయాత్సింహ బృహస్పతౌ || 22

శివలోకప్రదమితి శివేనోక్తం తథా పురా | యమునా శోణ యోస్స్నాయాద్గురౌ కన్యాగతే రవౌ || 23

ధర్మలోకే దంతి లోకే మహాభోగప్రదం విదుః | కావేర్యాం తు తథా స్నాయాత్‌ తులాగే తు రవౌ గురౌ || 24

విష్ణోర్వచన మహాత్మ్యాత్సర్వాభీష్ట ప్రదం విదుః | వృశ్చికే మాసి సంప్రాప్తే తథార్కే గురువృశ్చికే || 25

నర్మదాయాం నదీస్నానా ద్విష్ణులోక మవాప్నుయాత్‌ |

భాద్రపదమానములో గురువు సింహరాశిలో నుండగా గోదావరిలో (22) స్నానము చేసినచో, శివలోకము లభించునని పూర్వము శివుడు చెప్పినాడు. గురువు, రవి కన్యారాశి యందుండగా యమునా, శోణా నదులలో స్నానము చేసినచో (23), ధర్మలోకము నందు, వినాయకలోకము నందు మహాభోగములు లభించునని ఋషులు చెప్పెదరు. రవి, గురువు తులారాశి యందుండగా, కావేరి యందు స్నానమాచరించినచో (24), విష్ణువు వచనము యొక్క మహిమ వలన కోరికలన్నియు సిద్ధించునని ఋషులు చెప్పెదరు. మార్గశీర్ష మాసము నందు రవి, గురువు వృశ్చిక రాశి యందుండగా (25), నర్మాదా నది యందు స్నానము చేసినచో, విష్ణులోకము లభించును.

సువర్ణ ముఖరీ స్నానం చాపగే చ గురౌ రవౌ || 26

శివలోక ప్రదమితి బ్రహ్మణో వచనం యథా | మృగమాసి తథా స్నాయా జ్ఞాహ్నవ్యాం మృగగే గురౌ || 27

శివలోక ప్రదమితి బ్రహ్మణో వచనం యథా | బ్రహ్మ విష్ణ్వోః పదే భుక్త్వా తదంతే జ్ఞాన మాప్నుయాత్‌ || 28

గంగాయాం మాఘమాసే తు తథా కుంభగతే రవౌ | శ్రాద్ధం వా పిండదానం వా తిలోకదకమథాపి వా || 29

వంశద్వయ పితౄణాం చ కులకోట్యుద్ధరం విదుః | కృష్ణవేణ్యాం ప్రశంసంతి మీనగే చ గురౌ రవౌ || 30

గురువు, రవి ధనూరాశి యందుండగా సువర్ణముఖి యందు స్నానము చేసినచో (26), శివలోకము లభించునని బ్రహ్మచెప్పెను. మాఘమాసములో గురువు మకరరాశి యందుండగా గంగానది యందు స్నానము చేసినచో (27), శివలోకము లభించునని బ్రహ్మ చెప్పెను. మరియు, అట్టి మానవుడు బ్రహ్మలోక, విష్ణులోకములను కూడ అనుభవించి, తరువాత జ్ఞానమును పొందును (28). మాఘమాసములో రవి కుంభరాశి యందుండగా గంగలో శ్రాద్ధము గాని, పిండదానమును గాని, తిలోదక సమర్పణమును గాని (29) చేసినచో, రెండు వంశముల పితరులు కోటి తరముల వరకు ఉద్ధరింపబడుదురని ఋషులు చెప్పెదరు. గురువు, రవి మీనరాశి యందుండగా కృష్ణవేణిలో స్నానము ప్రశస్తమని ఋషులు చెప్పెదరు (30).

తత్తత్తీర్థే చ తన్మాసి స్నానమింద్ర పదప్రదమ్‌ | గంగాం వా సహ్యజాం వాపి సమాశ్రిత్య వసేద్బుధః || 31

తత్కాల కృతపాపస్య క్షయో భవతి నిశ్చితమ్‌ | రుద్రలోక ప్రదాన్యేవ సంతి క్షేత్రాణ్యనేకశః || 32

తామ్రపర్ణీ వేగవతీ బ్రహ్మలోక ఫలప్రదే | తయోస్తీరే హి సంత్యేవ క్షేత్రాణి స్వర్గదాని చ || 33

సంతి క్షేత్రాణి తన్మధ్యే పుణ్యదాని చ భూరిశః | తత్ర తత్ర వసన్‌ ప్రాజ్ఞస్తాదృశం చ ఫలం లభేత్‌ || 34

ఆయా తీర్థములలో ఆయా మాసములలో స్నానము చేసినచో, ఇంద్రపదము లభించును. పండితుడు గంగా తీరమున గాని, కావేరీ తీరమున గాని నివసించవలెను (31). అట్లు చేసిన యెడల, ఆ కాలము నందు చేసిన పాపము నశించునుటలో సందియము లేదు. రుద్రలోకము నిచ్చు క్షేత్రము లనేకము గలవు (32). తామ్రపర్ణీ, వేగవతీ అను నదులు బ్రహ్మలోకఫలము నిచ్చును. వాటి తీరము నందు స్వర్గము నిచ్చు క్షేత్రములు గలవు (33). ఆ రెండు నదుల మధ్యలో మహాపుణ్యము నిచ్చు క్షేత్రములు గలవు. వివేకి ఆయా క్షేత్రములలో నివసించి, ఆయా ఫలములను పొందును (34).

సదాచారేణ సద్వృత్త్యా సదా భావనయాపి చ | వసేద్దయాలుః ప్రాజ్ఞో వైనాన్యథా తత్ఫలం లభేత్‌ || 35

పుణ్యక్షేత్రే కృతం పుణ్యం బహుధా బుద్ధి మిచ్ఛతి | పుణ్యక్షేత్రే కృతం పాపం మహదణ్వపి జాయతే || 36

తత్కాలం జీవనార్థ శ్చేత్పుణ్యన క్షయమేష్యతి | పుణ్యమైశ్వర్యదం ప్రాహుః కాయికం వాచికం తథా || 37

మానసం చ తథా పాపం తాదృశం నాశ##యేత్‌ ద్విజాః |

మానవుడు సర్వకాలములలో సచ్ఛీలము, సత్ర్పవర్తన, సద్భావన, దయాగుణము గలవాడై, క్షేత్రములో నివసించవలెను. అట్లు గానిచో, ఆ ఫలము లభించదు (35). పుణ్యక్షేత్రములో చేసిన పుణ్యము అనేక రెట్లు వృద్ధి పొందును. పుణ్యక్షేత్రములో చేసిన పాపము లేశమంతైననూ మహాపాపము అగును (36). పుణ్యక్షేత్ర నివాసము వలన లభించే పుణ్యముచే పాపము వెనువెంటనే నశించును. పుణ్యము ఐశ్వర్యము నిచ్చునని ఋషులు చెప్పెదరు. ఓ ద్విజులారా! ఆ పుణ్యము శరీరముతో చేసిన, వాక్కుతో చేసిన మరియు (37) మనస్సుతో చేసిన పాపమును నశింపజేయును.

మానసం వజ్రలేపం తు కల్ప కల్పానుగం తథా || 38

ధ్యానాదేవ హి తన్నశ్యేన్నాన్యథా నాశమృచ్ఛతి | వచికం జపజాలేన కాయికం కాయశోషణాత్‌ || 39

దానాద్ధనకృతం నశ్యేన్నాన్యథా కల్పకోటిభిః | క్వచిత్పాపేన పుణ్యం చ వృద్ధిపూర్వేణ నశ్యతి || 40

బీజాంశ##శ్చైవ వృద్ధ్యంశో భోగాంశః పుణ్యపాపయోః | జ్ఞాననాశ్యో హి బీజాంశో వృద్ధిరుక్తర ప్రకారతః || 41

మనస్సుతో చేసిన పాపము వజ్రలేపము వలె మనస్సును పట్టుకొని కల్పకల్పాంతరముల వరకు వెంటాడును (38). అది ధ్యానము వలన మాత్రమే నశించును; మరో మార్గము లేదు. అధికమగు జపముచే వాచిక పాపము, శరీరమును కృశింపజేయు తపస్సుచే కాయిక పాపము (39), ధనముతో చేసిన పాపము దానము వలన నశించును. ఈపాపములు కోటి కల్పముల తరువాత నైననూ నశించుటకు మరియొక మార్గము లేదు. ఒకప్పుడు అధికమగు పాపముచే పుణ్యము కూడ నశించును (40). పుణ్యపాపములు రెండింటికీ బీజాంశము, వృద్ధ్యంశము, భోగాంశము అను మూడు భాగములుండును. పాపము యొక్క బీజాంశము జ్ఞానము చేతను, వృద్ధ్యంశము పైన చెప్పిన విధముగను నశించును (41).

భోగాంశో భోగనాశ్యస్తు నాన్యథా పుణ్యకోటిభిః | బీజప్రరోహే నష్టే తు శేషో భోగాయ కల్పతే || 42

దేవానాం పూజయా చైవ బ్రహ్మణానాం చ దానతః | తపోధిక్యాచ్చ కాలేన భోగః సహ్యో భ##వేత్‌ నృణామ్‌ || 43

తస్మాత్పాపమకృత్వైవ వస్తవ్యం సుఖమిచ్ఛతా || 44

ఇతి శ్రీ శివమహాపురాణ విద్యేశ్వర సంహితాయాం ద్వాదశోSధ్యాయః (12).

పాపము యొక్క భోగాంశము అనుభవించుట చేతనే నశించును; కోటి పుణ్యములను చేసినా నశించదు. పాపము యొక్క బీజాంశము నశించిన తరువాత, భోగాంశము మిగిలియుండును (42). దేవతల నారాధించుట చేత, బ్రాహ్మణులకు దానము చేయుట చేత, చిరకాలము తపస్సును చేయుట చేత మానవులకు పాపము యొక్క భోగాంశము సహనీయమగును (43). కావున, సుఖమును కోరు మానవుడు పాపమును చేయకుండగనే జీవంచవలెను (44).

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు పన్నెండవ అధ్యాయము ముగిసినది.

Sri Sivamahapuranamu-I    Chapters