Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ చతుర్దశో7ధ్యాయః అగ్నిరువాచ: ¸°ధిష్ఠిరీ కురుక్షేత్రం య¸° దౌర్యోధనీ చమూః | భీష్మద్రోణాదికాన్ దృష్ట్వా నాయుధ్యతి గురూనితి. 1 పార్థం హ్యువాచ భగవాన్నశోచ్యా భీష్మముఖ్యకాః | శరీరాణి వినాశీని న శరీరీ వినశ్యతి. 2 అయమాత్మా పరం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి విద్ధితమ్ | సిద్ధ్యసిధ్ధ్యో సమో యోగీ రాజధర్మం ప్రపాలయ. యధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణు డాతనితో ఇట్లనెను. భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మ నశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. "నేనే పరబ్రహ్మను" అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము. కృష్ణోక్తో7థార్జునో7యుధ్యద్రథస్థో వాద్యశబ్దవాన్ | భీష్మః సేనాపతిరభూ దదౌ దౌర్యోధనే బలే. 4 పాణ్డవానాం శిఖాణ్డీ చ తయోర్యుద్దం బభూవ హ | ధార్తారాష్ట్రాః పాణ్డవాంశ్చ జఘ్నుర్యుద్ధే సభీష్మకాః. 5 ధార్తరాష్ట్రాన్శిఖణ్డ్యాద్యాః పాణ్డవా జఘ్నరాహవే | దేవసురసమం యుద్ధం కురుపాణ్డవసేనయోః 6 బభూవ ఖస్థ దేవానాం పశ్యతాం ప్రీతివర్ధనమ్ | ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి యయ్యెను. పాండవలకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడన కౌరవులు యుధ్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దైవాసుర యుద్ధము వలె జరిగెను. భీష్మో7సై#్త్రః పాణ్డవం సైన్యం దశాహోభిర్న్యపాతయత్. 7 దశ##మే హ్యర్జునో బాణౖర్భీష్మం వీరం వవర్ష హా | శిఖణ్డీ ద్రుపదోక్తో7సై#్త్రర్వవర్ష జలదో యథా. 8 హస్త్యశ్వరథపాదాతమన్యోన్యాస్త్రనిపాతితమ్ | భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురింపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ, మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను. భీష్మః స్వచ్ఛన్దమృత్యశ్చ యుద్దమార్గం ప్రదర్శ్య చ. 9 వసూక్తో వసులోకాయ శరశయ్యాగతః స్థితః | ఉత్తరాయణమీక్షంశ్చ ధ్యాయన్ విష్ణుం స్తువన్ స్థితః 10 స్వేచ్ఛామరణము గల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తారాయణమునకై వేచి యుండెను. దుర్యోధనే తు శోక్తార్తే ద్రోణః సేనాపతి స్త్వభూత్ | పాణ్డవే హర్షితే సైన్యే దృష్టద్యుమ్నశ్చమావతిః 11 దుర్యోధనుడు శోకార్తు డయ్యెను అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను. తయోర్యుద్దం బభూవోగ్రం యమరాష్ట్ర వివర్ధనమ్ | విరాటద్రుపదాద్యాశ్ఛ విమగ్నా ద్రోణసాగరే. 12 వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రమునందు విరాట ద్రువదాదులు మునిగిపోయిరి. దౌర్యోధనీ మహాసేనా హస్త్యశ్వరథపత్తనీ | దృష్ఠద్యుమ్నాధిపతినా ద్రోణః కాల ఇవాబభో. 13 హస్త్యశ్వరథవదాతులు గల దుర్యోధనసేన కూడ పాండవసేనాపతియైన దృష్ఠద్యుమ్ముని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్దమునందు యముడు వలె కన్పట్టెను. హతో7శ్వత్థామా చేత్యుక్తేద్రోణః శస్త్రాణి చాత్యజత్ | ధృష్టద్యుమ్నశరాక్రాన్తః పాతితః స మహీతలే. 14 వఞ్చమేహని దుర్ధర్షః సర్వక్షత్రం ప్రమథ్యం చ | అశ్వత్థామ మరణించెను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్నుని బాణములచే కొట్టబడి మరణించెను. దుర్యోధనే తు శోకార్తేకర్ణః సేనాపతి స్త్వభూత్.15 అర్జునః పాణ్డవానాం చ తయోర్యద్ధం బభూవ హ | శస్త్రాశస్త్రి మహారౌద్రం దేవాసురరణోపమ్. 16 దుర్యధనుడు శోకార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగెను. కర్ణార్జునాఖ్యే సఙ్గ్రామే కర్ణో7రీనవధీచ్ఛరైః | ద్వితీయో7హని కర్ణస్తు అర్జునేన నిపాతితః. 17 కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను. శల్యో దినార్ధం యయుధే హ్యవధీత్తం యుధిష్ఠిరంః | యుయుధే భీమసేనేన హతసైన్యః సుయోధనః. 18 బహున్ హత్వా నరాదీంశ్చ భీమసేన మథద్రవత్ | గదయా ప్రహరన్తం తు భీమస్తం హి వ్యపాతయత్. గదయాన్యానుజాం స్తస్య తస్మిన్నష్టాదశే7హని | శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ద దివనము యుద్దము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదు నెనిమిదవ దినమున పడగొట్టెను. రాత్రౌ సుషుప్తం చ బలం పాణ్డవానాం న్యపాతయత్. 20 అక్షౌహిణీ ప్రమాణం తు అశ్వత్థామా మహాబలః | ద్రౌపదేయాన్ స పాఞ్చాలాన్ దృష్టద్యుమ్నం చ సో7వధీత్. మహాబలశాలి యైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల సేనను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను. పుత్రహీనాం ద్రౌపదీం తాం రుదన్తీమర్జున స్తతః | శిరోమణిం చ జగ్రాహ ఐషీకాస్త్రేణ తస్య చ. 22 పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషీకాస్త్రముచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను. అశ్వత్థామాస్త్రనిర్దగ్థం జీవయామాస వై హరిః | ఉత్తరాయాస్తతో గర్భం స పరీక్షిదభూన్నృపః . 23 శ్రీ కృష్ణుడు అశ్వత్థామాస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భన్ధశిశువు పరీక్షిన్మహారాజు ఆయెను. కృతవర్మా కృపో ద్రౌణిస్త్రయోముక్తాన్తతో రణాత్ | పాణ్డావాః సాత్యకిః కృష్ణః సప్తముక్తా న చాపరే. 24 ఆ యుద్దమునుండి, కృతవర్మ కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమున పంచపాండవులు, సాత్యకి, కృష్ణడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు. స్త్రియశ్చార్తాః సమాశ్వాస్య భీమాద్యైః స యుధిష్ఠిరః | సంస్కృత్య ప్రహతాన్వీరాన్దత్తోదకధనాదికః 25 భీష్మాచ్ఛాన్తనవాచ్ఛ్రుత్వా ధర్మాన్ సర్వాంశ్చ శాన్తిదాన్ | రాజధర్మాన్ మోక్షధర్మాన్ దానధర్మాన్నృపో7భవత్. 26 అశ్వమేధ దదౌ దానం బ్రహ్మణభ్యో7రి మర్దనః | యుధిష్ఠిరుడు దుఃఖర్తాలైన స్త్రీలను ఓదార్చి, భీమాదినమేతుడై, మరణించిన వీరు లందరికిని ప్రేత సంస్కారములను చేసి, వారికై ఉదక ధనాదిదానములు చేసి, శంతనుకుమారుడైన భీష్మునినుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను, దానధర్మములను విని, రాజయ్యెను. éశత్రుసంహారి యైన ఆతడు ఆశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానము లిచ్చెను. శ్రుత్వార్జునాన్మౌసలేయం యాదవానాం చ సంక్షయమ్ | రాజ్యే పరీక్షితం స్థాప్య సానుజః స్వర్గమాప్తవాన్. ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ చతుర్దోశో7ధ్యాయః ముసలము పుట్టి యాదవు లందరును నశించి రను విషయమును అర్జునునినుండి తెలిసికొని పరీక్షిత్తను రాజ్యాభిషిక్తుని చేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను. అగ్ని మహాపురణమునందు మహాభారతఖ్యాన మను చతుర్దశాధ్యాయము సమాప్తము.