Sri Matsya Mahapuranam-2
Chapters
ఏకోనాశీత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః హిరణ్యాశ్వదానవిధానమ్. శ్రీ మత్స్యః : అథాత స్సమ్ప్రవక్ష్యామి హిరణ్యాశ్వవిధిం పరమ్| యస్య ప్రదానా ద్భువనే చానన్త్యం ఫల మశ్నుతే. 1 పుణ్యాం తిథి మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్| లోకేశావాహనం కుర్యా త్తులాపురుషదానవత్. 2 ఋత్విఙ్మణ్డపసమ్భారభూషణాచ్ఛాదనాదికమ్| స్వల్పే త్వే కాగ్ని వత్కర్యా ద్దేమవాజిమఖం బుధః. 3 స్థాపయే ద్వేదిమధ్యేతు కృష్ణా జినతిలోపరి| కౌశేయవస్త్రం సంవీతం కారయే ద్ధేమవాజినమ్. 4 శక్తిత స్త్రిపలాదూర్ధ్వ మాసహస్రపలా త్తథా| పాదుకోపానహచ్ఛత్రం చామరాసనభాజనైః. 5 పూర్ణకుమ్భాష్టకోపేతం మాల్యేక్షుఫలసంయుతమ్| శయ్యాం సోపస్కరాం తద్వ ద్ధేమమార్తాణ్డసంయుతామ్. 6 తత స్సర్వౌషధీస్నాన స్నాపితకో విప్రపుఙ్గవైః| ఇమ ముత్తారయే న్మన్త్రం గృహీతకుసుమాఞ్జలిః. 7 నమస్తే సర్వదేవేశ వేదాహరణలమ్పట| వాజిరూపేణ మా మస్మా త్పాహి సంసారసాగరాత్. 8 త్వమేవ సప్తధా భూత్వా చన్ధోరూపేణ భాస్కర| యస్మా ద్ర్భమయసే లోకా నతః పాహి సనాతన. 9 ఏవ ముచ్చార్వ గురవే తమశ్వం వినివేదయేత్| దత్వా పాపక్షయా ద్భానో ర్లోక మభ్యేతి శాశ్వతమ్. 10 గోభి ర్విభవత స్సర్వా నృతిజశ్చాపి పూజయేత్| సర్వధాన్యోపకరణం గురవే వినివేదయేత్. 11 సర్వం హిరణ్యాశ్వవిధిం కరోతి య స్సమ్సూజ్యమానో దివి దేవసఙ్ఘైః | విముక్త పాప స్స పదం మురారేః ప్రాప్నోతి సిద్ధై రభిపూజిత స్స&. 13 ఇతి పఠతి య ఏత ద్ధేమవాజిప్రదానం సకలకలుషయుక్త స్సో7శ్వమేధేన యుక్తః కనకమయవిమానేనా7 ర్కలోకం ప్రయాతి త్రిదశపతివధూభిః పూజితో యో 7భిపశ్యేత్. 14 యో వా శృణోతి పురుషో7 ల్పధన స్స్మరేద్వా హేమాశ్వదాన మభినన్దతి చేహ లోకే| సో7పి ప్రయాతి హతకల్మషశుద్ధదేహ స్థ్సానం పురన్దరమహేశ్వరదేవజుష్టమ్. 15 ఇతి శ్రీ మత్స్య మహాపురాణ మహాదాను కీర్తనే హిరణ్యా శ్వ ప్రదానికో నామ ఏకోనాశీత్యుత్తరద్విశతతమో7ధ్యాయః. రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. హిరణ్యాశ్వ దాన విధానము. శ్రీ మత్స్యుడు మనువునకిట్లు చెప్పెను: ఇపుడిక షోడశమహాదాన క్రమ మునందలి హిరణ్యాశ్వదాన విధానమును తెలిపెదను; ఇది చాల ఉత్తమమయినది; దీని నిచ్చినందువలన దాత భువనములందు విలక్షణముగ అనంతమగు ఫలము నందును ; పుణ్య కరమగు శుభతిథియందు విప్రులచే పుణ్యాహవాచనమును లోకపాలనా వాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములను వస్త్రములు మొదలగు వానిని తులా పురుష దానమునందువలెనే జరుపవలెను; స్వల్ప ప్రక్రియతో జరుపదలచిన వారు ఏకాగ్ని విధానముతోనే ఈ హిరణ్యాశ్వ దాన యక్షమును తరుపలెను; బంగరు గుర్రమును తన శక్తి ననుసరించి మూడు పలములకంటె ఎక్కువగ సహస్ర పలములకు మించిన బంగారుతో చేయించి దానిని వేదీ మధ్యమందు కృష్ణాజినముపై నూవులయందు వట్టువస్త్రములతో చుట్టి ఉంచవలయును; దాని దగ్గర పాదుకలు పాదరక్షలు ఛత్త్ర చామరాసన పాత్రములు ఎనిమిది పూర్ణ కుంభములు మాల్యములు చెరకు గడలు ఫలములు ఉపస్కరములతో కూడ శయ్య బంగరు సూర్యుడు- ఇవి యన్నియు ఉంచవలెను; తరువాత యజమానుడు బ్రాహ్మణులచే సర్వౌషధీ స్నానము జరిపించుకొని దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రముచ్చరించవలయును: ''సర్వదేవేశా! రూపమున వేదములను తెచ్చుటయందు ఆసక్తి కలవాడా! (హయగ్రీవ) అశ్వరూపముతో నీవును మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము; భాస్కరా నీవే చందోరూపమున ఏడుగానయి (వేదమునందలి ప్రధాన చందస్సులు ఏడు మాత్రమే ) లోకములను ప్రవర్తిల్లజేయుచున్నావు; కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము''. ఇట్లుచ్చరించి ఆయశ్వమును గురువునకు అర్పించవలయును; దాని ఫలముగా పాపక్షమగుటవలన శాశ్వత మగు భాను లోకమును పొందును; తరువాత యథాశక్తిగా గోవులతో ఋత్వికులను పూజించవలయును; సర్వధాన్యోపతరణములను గురువునకు ఈయవలెను. శయ్య మొదలగునవి కూడ (పాత్రులకు) దానముచేసి తైలరహితముగు ఆహారమును భుజించవలయును; పురాణ శ్రవణమును భోజనాదికమును జరిపించవలెను. ఈ హిరణ్యాశ్వ దాన మొనర్చినవాడు పాపముక్తుడై స్వర్గమున సిద్ధులచే ఇతర దేవసంఘములచే పూజితుడగుచు నారాయణపదప్రాప్తుడగును; దీనిని పఠించువాడును సకల పాపముక్తుడై అశ్వమేధఫలము నందును; కనకమందు విమానమున రవిలోకమేగి అట అప్సరః పూజితుడగును; అల్పధన పురుషుడు దీనిని వినను చూచినను స్మరించి మెచ్చి నను అట్టివాడును పాపనాశమున శుద్ధదేహుడై ఇంద్ర రుద్రాదులు వసించు లోకములందును. ఇది శ్రీ మత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వ ప్రదానికమను రెండు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.