Sri Vamana Mahapuranam
Chapters
పదునెనిమిదవ అధ్యాయము పులస్త్య ఉవాచ : మాసిచాశ్వయుజే బ్రహ్మన్ యదా పద్మం జగత్పతేః | నాభ్యానిర్యాతిహితదా దేవేష్వేతాన్యధోభవన్. 1 కందర్పన్యకరాగ్రేతు కదంబశ్చారుదర్శనః | తేనతస్యపరాప్రీతిః కదంబేన వివర్దతే. 2 యక్షాణామధిపస్యాపి మణిభద్రస్యనారద | వటవృక్షః సమభవత్ తస్మింస్తస్యరతిఃసదా. 3 మహేశ్వరస్యహృదయే ధత్తూరవిటపః శుభః | సంజాతః సచశర్వస్య రతికృత్ తస్యనిత్యశః. 4 బ్రహ్మణోమధ్యతోదేహా జ్ఞాతోమరకతప్రభః | ఖదిరఃకంటకీశ్రేయా నభవద్విశ్వకర్మణః. 5 గిరిజాయాఃకరతలే కుందగుల్మస్త్వజాయత | గణాధిపస్యకుంభస్థో రాజతేసింధువారకః. 6 యమస్యదక్షిణపార్శ్వే పాలాశోదక్షిణోత్తరే | కృష్ణోదుంబరకోరుద్రా జ్ఞాతఃక్షోభకరోవృషః.
7 స్కందస్యబంధుజీవస్తు రవేరశ్వత్థఏవచ | కాత్యాయన్యాఃశమీజాతా బిల్వోలక్ష్మ్యాఃకరే೭భవత్. 8 నాగానాం పతయేబ్రహ్మన్ శరస్తంబోవ్యజాయత | వాసు కేర్విస్తృతే పుచ్ఛేపృష్ఠే దూర్వాసితాసితా. 9 సాధ్యానాం హృదయేజాత్ వృక్షో హరితచందనః | ఏవంజాతేషు సర్వేషు తేన తత్రరతిర్భవేత్. 10 బ్రహ్మర్షే ! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతలు నుంచి కూడా ఆయా పుష్పాదులుధ్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆమన కాపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది; ఆయనకా వృక్షమంటే ఎంతో ప్రేమ, పరమ శివుడు తన హృదయాన్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్య భాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మనుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని ఆయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి ఆరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాధిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిన పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాలనుండి నల్లమేడి, రుద్రునిదేహంనుండి క్షోభం కలిగించే వృషవిటపం కుమారస్వామినుండి బంధుజీవనం, సూర్యునినుండి ఆశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయనివల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాలనుంచి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమనుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి. తత్రరమ్యే శుభేకాలే యాశుక్లైకాదశీ భ##వేత్ | తస్యాంసంపూజయేద్విష్ణుం తేనఖండో೭స్య పూర్యతే. 11 పుషై#్పఃపత్త్రెః ఫలైర్వాపి గంధవర్ణరసాన్వితైః | ఓషధీభిశ్చముఖ్యాభి ర్యావత్ స్యాచ్ఛరదాగమః. 12 ఘృతంతిలా వ్రీహియవా హిరణ్యకనకాది యత్ | మణిముక్తాప్రవాళాని వస్త్రాణి వివిధానిచ. 13 రసానిస్వాదుకట్వవ్లు కషాయలవణానిచ | తిక్తానిచనివేద్యాని తాన్యఖండాని యానిహి. 14 తత్పూజార్థం ప్రదాతవ్యం కేశవస్య మహాత్మనే | యదాసంవత్సరంపూర్ణ మఖండం భవతేగృహే. 15 కృతోపవాసోదేవర్షే ద్వితీయే೭హని సంయతః | స్నానేన తేన స్నాయీత యేనాఖండం హి వత్సరమ్. 16 సిద్దార్థకైస్తిలైర్వాపి తేనై వోద్వర్తనం స్మృతమ్ | హవిషాపద్మనాభస్య స్నానమేవ సమాచరేత్ | హోమేతదేవగదితం దానే శక్తిర్నిజాద్విజ. 17 పూజయేతాథకుసుమైః పాదాదారభ్య కేశవమ్ | ధూపయేద్వివిధంధూపం యేనస్యాద్ వత్సరంపరమ్ 18 హిరణ్యరత్నవాసోభిః పూజయేత జగద్గురుమ్ | రాగఖాండవచోష్యాణి హవిష్యాణి నివేదయత్. 19 తతస్సంపూజ్యదేవేశం పద్మనాభం జగద్గురుమ్ | విజ్ఞాపయేన్మునిశ్రేష్ఠ మంత్రేణానేన సువ్రత. 20 అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్రఫల, గంధాదులతోను, వర్ణరస ముఖ్య ఓషదులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు పవడాలు, వివిధ వస్త్రాలు. తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను ఆఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తిఅయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానంచేయాలి. విష్ణుదేవుని నేతితో ఆభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి ఘృతదానంచేయాలి. తదనంతరం పద్మ నాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపలువేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. ఆనంతరమాజగన్నాథుని స్వర్ణరత్నాలతోను చీని చీనాంబరాలతో నలంకరించి మిష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్ఠా! ఇలా సమర్పించిన తర్వాత నా జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి. నమోస్తుతే పద్మనాభ పద్మాధవ మహాద్యుతే | ధర్మార్థకామోక్షాణి త్వఖండాని బవంతుమే.
21 వికాసిపద్మపత్రాక్ష యథా೭ఖండో ೭సి సర్వతః | తేనసత్యేనధర్మాద్యా ఆఖండాః సంతు కేశవ.
22 ఏవంసంవత్సరంపూర్ణం సోపవాసో జితేంద్రియః | అకండపారయేద్ బ్రహ్మన్ వ్రతం వై సర్వవస్తుషు. 23 అస్మింశ్చీర్ణేవ్రతేవ్యక్తం పరితుష్యన్తి దేవతాః | ధర్మార్థకామమోక్షాద్యా స్త్వక్షయాః సంభవంతిహి. 24 ఏతానితేమయోక్తాని వ్రతాన్యుక్తాని కామిభిః | ప్రవక్ష్యామ్యధునాత్వేత ద్వైష్ణవం పంజరం శుభమ్. 25 ''ఓ పద్మనాభ! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నుల వాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామ మోక్షాలు, ఆఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!''ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్థు సర్వ విషయాలలోనూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు. ఈ విధంగా వ్రతమాచరించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసినవానికి చతుర్విద పురుషార్థాలు పూర్ణంగా సిద్దిస్తాయి. వారణా ! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ కెరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్నుపంజర స్తోత్రం వినిపించెదను. శ్రీవిష్ణుపంజర స్తోత్రమ్ : నమోనమస్తే గోవింద చక్రంగృహ్య సుదర్శనమ్ | ప్రాచ్యాంరక్షస్వమాంవిష్ణో త్వామహం శరణంగతః. 26 గదాంకౌమోదకీంగృహ్య పద్మనాభామితద్యుతే | యామ్యాంరక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః. హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ | ప్రతీచ్యాంరక్షమే విష్ణో భవంతం శరణంగతః. 28 ముసలంశాతనంగృమ్యపుండరీకాక్ష రక్షమామ్ | ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః. 29 శార్జమాదాయచధనురస్త్రం నారాయణం హరే | నమస్తేరక్షరక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః. 30 పాంచజన్యంమహాశంఖ మంతర్బోధ్యం చ పంకజమ్ | ప్రగృహ్యరక్షమాంవిష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర. చర్మసూర్యశతంగృహ్య ఖడ్గం చంద్రమసంతధా | నైర్ ఋత్యాంమాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్. వైజయంతీంప్రగృహ్యత్వం శ్రీవత్పం కంఠభూషణమ్ | వాయవ్యాంరక్షమాందేవ అశ్వశీర్ష నమోస్తుతే. 33 వైనతేయం సమారుహ్య అంతరిక్షేజనార్దన | మాంత్వరంరక్షాజిత్ సదా నమస్తే త్వపరాజిత. 34 విశాలాక్షంసమారుహ్య రక్ష మాంత్వం రసాతలే | ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమోస్తుతే. 35 కరశీర్సాంఘ్రిపర్వేషుతథా೭ష్టబాహుపంజరమ్ | కృత్వారక్షస్వమాందేవ నమస్తే పురుషోత్తమ. 36 ఏతదుక్తంభగవతావైష్ణవం పంజరం మహత్ | పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ. 37 నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్ | సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్. 38 గోవిందా ! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణో! నీవు నన్ను తూర్పన రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో ! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను ! పుండరీకాక్ష ! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా ! నీకు శరణాగతుడును. ఓ రాక్షస నాశకా ! శార్ఙ్గ ధనస్సును నారాయనాస్త్రాన్ని ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా ! పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ ! దివ్యమూర్తీః సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైరృతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్దనా! గరుడ వాహనారూఢుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదానమస్సులు! విశాలక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! అకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు, తల, పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయనికి చెప్పాడు. ఓ బ్రహ్మణోత్తమా! దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసురునీ, నమరుడు, రక్తబీజుడు తదితరు లెందరో దానవులను సుర కంటకులను నాశనం గావించింది. నారద ఉవాచ : కా೭సౌ కాత్యాయనీ నామ యా జఘ్నే మహిషాసురమ్ | నమరంరక్తబీజంచ తథా೭న్యాన్ సురకంటకాన్. కశ్చాసౌమహిషోనామ కులేజాతశ్చ కస్యసః | కశ్చాసౌరక్తబీజాఖ్యో నమరః కస్య చాత్మజః. 40 పులస్త్య ఉవాచ : శ్రూయతాంసంప్రవక్ష్యామి కథాం పాపప్రణాశినీమ్ | సర్వదావరదాదుర్గాయేయం కాత్యాయనీ మునే. 41 పురా೭సురవరౌరౌద్రౌ జగత్క్షోభకరావుభౌ | రంభ##శ్చైవకరంభశ్చ ద్వావాస్తాం సుమహాబలౌ. 42 తావపుత్రౌచదేవర్షే పుత్రార్థం తేపతు స్తపః | బహూన్ వర్షగణాన్ దైత్యౌ స్థితౌ పంచనదే జలే. 43 తత్త్రైకోజలమధ్యస్థో ద్వితీయో೭ప్యగ్నిపంచమీ | కరంభ##శ్చైవరంభశ్చయక్షం మాలవటం ప్రతి. 44 ఏకం నిమగ్న సలిలే గ్రాహరూపేణ వాసవ ః | చరణాభ్యాంసమాదాయ నిజగాన యథేచ్ఛయా. 45 తతోభ్రాతరినష్టేచరంభః కోపపరిప్లుతః | వహ్నౌస్వశీర్షం సంక్షిద్య హోతుమైచ్ఛన్ మహాబలః. 46 తతః ప్రగృహ్య కేశేషు ఖడ్గం చ రవిసప్రభమ్ | ఛేత్తుకామో నిజం శీర్షం వహ్నినా ప్రతిషేధితః. 47 ఉక్తశ్చమాదైత్యవర నాశయాత్మాన మాత్మనా | దుస్తరాపరవధ్యా೭పి స్వవధ్యా೭ప్యతి దుస్తరా. 48 యచ్చప్రార్థయసేవీరః తద్దదామి యథేస్సితమ్ | మామ్రియస్వమృతస్యేవ నష్టా భవతి వై కథా. 49 తతో೭బ్రవీద్వచోరంభో వరం చే న్మే దదాసి హి | త్త్రెలోక్యవిజయీపుత్రః స్యాన్మే త్వత్తేజసాధికః. 50 అజేయాదైవతైః సర్వైః పుంభిర్దైత్యైశ్చ పావక | మహాబలోవాయురివ కామరూపీ కృతాస్త్రవిత్. 51 తంప్రోవాచకవిర్ బ్రహ్మన్ బాఢమేవం భవిస్యతి | యస్యాంచితం సమాలంబి కరిష్యసి తతఃసుతః. 52 నారదుడనెను - దేవకంటకులైన మహిషదైత్యునీ నమర, రక్తబీజులను వధించిన ఆకాత్యాయని ఎవరు ? ఆ మహిషుడెవడు ? అతడు పుట్టిన వంశ##మేది? ఆనమర రక్తబీజులెవరి కుమారులు ? మహర్షే ! ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి. పులస్త్యుడిట్లనెయె -- ఓమునీ ! ప్రాచీనకాలాన జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతున్నా వినుము. సమస్తమైన వరాలు ప్రసాదించ దుర్గయే యా కాత్యాయని. పురాసమయాన, జగత్తు నంతా సంక్షోభింపజేసే యిద్దరు రాక్షసులు, మహాబలశాలురు ఉండేవారు. వారు రంభుడు కరంభుడు. అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మునిగి చాలా ఏండ్లు తపస్సు చేశారు. వారిలో కరంభుడు జలమధ్మంలో, రంభుడు అగ్ని మద్యంలో ఉండి, మాలవట యక్షుని గూర్తి తపించారు. కరంభుడు నీటిలో మునిగిపోగా యింద్రుడు మకర రూపానవాని కాళ్ళు పట్టుకొన లాగికొని పోయి తన కోరిక మేరకు వధించెను. సోదరుని చావునకు కోపించి రంభుడు తన తల నరికి అగ్ని లోవేల్చ సంకల్పించెను. తన జుట్టు ఒక చేతపట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల నరుకుకొనబోగా రంభుని అగ్ని వారించి యిట్లనెను - రాక్షసేశ్వరా ! తన్ను తాను చంపుకొనుట మంచిదికాదు. పరహత్యాపాతకం కంటే ఆత్మ హత్యాపాతకం భయంకరమైనది. దుస్తరమైనది. చచ్చిన వానినెవడూ పట్టించుకోడు. నీ కోరికయేదో చెప్పుము. నేను నెరవేర్చగలను. అప్పుడు రంభుడు - ''ఓ అగ్నీ! నాకు వరమివ్వదలచుచో నీకంటే తేజస్వి, దేవతల కజేయుడు, నరదైత్యుల కవధ్యుడు వాయువునకు వలె బలవంతుడు, కామరూపుడు సర్వాస్త్రకోవిదుడు, త్రిలోక విజయం సాధించ గలిగిన పుత్రుని దయచేయుమ'' నియెను. అందుకు అగ్ని ''తప్పకుండా లాగే జరుగగలదు. నీకు, ప్రియురాలైన వనితయందు అలాంటి పుత్రునికను''మని వచించెను. ఇత్యేవముక్తో దేవేన వహ్నినా దానవో య¸° | ద్రష్టుంమాలవటం యక్షం యక్షైశ్చ పరివారితమ్. 53 తేషాంపద్మనిధిస్తత్ర వసతే నాన్యేచేతనః | గజాశ్చ మహిషాశ్చాశ్వా గావో೭జావిపరిప్లుతః54 తాన్ దృష్ట్వైవ తదా చక్రేభావం దానవపార్థివః | మహిష్యాం రూపయుక్తాయాంత్రిహాయణ్యాం తపోధన. 55 సాసమాగాచ్చదైత్యేంద్రం కామయంతీ తరస్విన్ | సచాపిగమనంచక్రే భవితవ్యప్రచోదితః. 56 తస్యాంసమభవద్ గర్భస్తాం ప్రగృహ్యాథదానవః | పాతాళం ప్రవివేశాథ తతః స్వభవనం గతః. 57 దృష్టశ్చదానవైః సర్వైః పరిత్యక్తశ్చ బంధుబిః | అకార్యకారకేత్యేవం భూయో మాలవటం గతః. 58 సా೭పితేనై వపతినా మహిషీ చారుదర్శనా | సమంజగామతత్పుణ్యం యక్షమండలముత్తమమ్.59 తతస్తు వసతస్తస్య శ్యామా సా సుషువే మునే | అజీజనత్సుతంశుభ్రం మహిషం కామరూపిణమ్. 60 ఏతామృతుమతీం జాతాం మహిషో೭న్యోదదర్శహ | సాచాభ్యగాద్ దితివరం రక్షంతీ శీలమాత్మనః. 61 తమున్నామితనాసంచ మహిషంవీక్ష్యదానవః | ఖడ్గంనికృష్యతరసా మహిషం సముపాద్రవత్. 62 తేనాపిదైత్య స్తీక్ష్భభ్యాం శృంగాభ్యాం హృదితాడితః | నిర్బన్నహృదయోభూమౌ నిపపాత మమార చ. 63 మృతేభర్తరి సాశ్యామా యక్షాణాం శరణంగతా | రక్షితా గుహ్మకైః సాధ్వీ నివార్య మహిషం తతః.64 తతోనివారితోయక్షైర్హయారి ర్మదనాతురః | నిపపాతసరోదివ్యం తతో దైత్యో೭భవన్మృతః. 65 నమరోనామవిఖ్యాతో మహాబలపరాక్రమః | యక్షానాశ్రిత్యతస్థౌ సకాలయన్ శ్వాపదాన్ మునే. 66 సచదైత్యేశ్వరో యక్షై ర్మాలవట పురస్సరైః | చితామారోపితఃసాచ శ్యామా తంచారుహత్పతిమ్. 67 తతో೭గ్ని మధ్యాదు త్తస్థౌ పురుషో రౌద్రదర్శనః | వ్యద్రావయత్సతాన్ యక్షాన్ ఖడ్గపాణి ర్భయంకరః. 68 తతోహతాస్తుమహిషాః సర్వా ఏవ మహాత్మనా | బుతే సంరోక్షితారంహి మహిషం రంభనందనమ్. 69 సనామతః స్మృతో దైత్యో రక్తబీజో మహామునే | యో೭జయత్ సర్వతో దేవాన్ సేంద్రరుద్రార్కమారుతాన్. 70 ఏవంప్రభావా దనుపుంగవాస్తే తేజో೭ధికస్తత్ర బభౌ హయారిః | రాజ్యేభిషిక్తశ్చ మహా೭సురేంద్రై ర్వినిర్జితైః శంబరతారకాద్యైః.71 అశక్నువద్బిః సహితైశ్చదేవైః సలోకపాలైః సహుతాశభాస్కరైః | స్థానాని త్యక్తాని శశీంద్రభాస్కరై ర్దర్మశ్చ దూరే ప్రతియోజితశ్చ. ఇతి శ్రీ వామనమహాపురాణ అష్టాదశో೭ధ్యాయః. అగ్నిదేవుని యాదేశాను సారం, అనేక మంది యక్షులతో పరివేష్టితుడైయున్న మాలవట యక్షుని చూచుటకై ఆదానవుడు వెళ్ళిపోయెను. ఆ ప్రదేశాన గజాశ్వ మహిషములు గోవులు మేకలచే పరివృతుడై యుండియు అనన్య చిత్తుడైన పద్మనిధి నివసించుచుండెను. వాటి మధ్య ఉన్నటు వంటి మూడేండ్ల వయస్సు గలిగి అందముగానున్న ఆడు మహిషాన్ని చూచి ఆదానవుడు మోహితుడాయెను. ఓ మునీ ! విధి విధానం వల్ల ఆ ఆడుమహిషం గూడ ఆరాక్షసునితో సంగమించుట కై త్వరగా ఆతనిని సమీపించగా వాడు దానితో రమించెను. వెంటనే అది గర్భం ధరించగా దానిని తీసికొని అతడు పాతాళంలో తన భవనానికి జేరెను. అతడు చేసిన అకార్యానికి తోడి రాక్షసులాతనిని బరిత్యజించగా అతడచ్చోటు వదలి తిరిగి మాలవటం చేరెను. ఆ మహిషి గూడ పతిని అనుగమించి ఆ యక్షమండలమునకు వెళ్ళెను. వారక్కడ ఉండగా నా నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించెను. అది కామరూపి. ఒకనాడా మనిషి ఋతుమతి అయి ఉండగా మరొక మహిషం (మగది) దానిని చూచి మోహంతో వెంబడించగా నాశ్యామ తన శీలమును రక్షించుకొనుట కై భర్తయైన రాక్షసుని సమీపించెను. మోర ఎత్తుకొని వెంటబడిన ఆ దున్నపోతు మీదకు ఆ రాక్షసుడు కత్తిదూసి లంఘించెను. అంతట నా దున్నపోతు తన కొమ్ములతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించెను. తన భర్త మరణించడంతో నా మహిషి యక్షులను శరణుజొచ్చెను. యక్షులచేత నివారింపబడిన ఆ దున్నపోతు మోహాతిరేకంతో చేయునది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులోబడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించెను. ఆ బలపరాక్రమ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు. అతడు ఆ యక్షుల మరుగున జేరి అక్కడ నున్న జంతువుల నెల్లను బార ద్రోలెను. అంతట మాలవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నాశ్యామ మహిషి తనపతితో చితాగ్నిలో బడిపోయెను. అంతట నా చితాగ్ని మధ్యం నుండి రౌద్రాకారుడగు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపాణియై ఆ యక్షులనందరను వెళ్ళగొట్టెను. ఆ వీరుడు రంభనందనుడైన మహిషుని వదలి మిగిలిన మహిషములనన్నింటిని వధించెను. ఓ మహామునీ! ఆతడే రక్తబీజుడు. వాడు యింద్రరుద్ర సూర్య మరుత్తులతో సహా దేవతలనందరను జయించాడు. ఆ రాక్షస వీరులంతటి పరాక్రమవంతులు. అయితే వారందరిలోను మహిషాసురుడు గొప్పవాడు. శంబరుడు, తారకుడు మొదలయిన వారలనందరను జయించినాడు. వారందరు నాతనిని తమ ప్రభువుగా అభిషేకించారు. ఆతని ధాటికి నిలువలేక లోకపాలకులందరు సూర్యచంద్రాగ్నులతో సహా తమతమ స్థానాలు వదలి పారిపోయారు. ధర్మానికి స్థానం అంటూ లేకుండా పోయింది. ఇది శ్రీ వామనమహాపురాణంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.