Sri Vamana Mahapuranam
Chapters
పదిహేనవ అధ్యాయము లోమహర్షణ ఉవాచ : మానుష్యస్యతుపూర్వేణ క్రోశమాత్రేద్విజోత్తమాః | అపగానామ విఖ్యాతానదీ ద్విజనిషేవితా. 1 శ్యామాకంపయసా సిద్ధమాజ్యేన చపరిప్లుతమ్ | యేప్రయచ్ఛంతి విప్రేభ్యః తేషాంపాపంనవిద్యతే. 2 యేతుశ్రాద్ధం కరిష్యంతి ప్రాప్యతామాపగాంనదీమ్ | తేసర్వకామసంయుక్తా భవిష్యన్తినసంశయః 3 శంసంతిసర్వేపితరః స్మరంతిచపితామహాః | అస్మాకంచకులేపుత్రః పౌత్రోవా7పిభవిష్యతి. 4 యఆపగాంనదీంగత్వా తిలైఃసంతర్సయిష్యతి | తేనతృప్తాభవిష్యామో యావత్కల్పశతంగతమ్. 5 సభ##స్యేమాసి సంప్రాప్తే కృష్ణపక్షేవిశేషతః | చతుర్దశ్యాంతుమధ్యాహ్నే పిండదోముక్తిమాప్నుయాత్. 6 తతోగచ్ఛేతివిప్రేంద్రా బ్రహ్మణః స్థానముత్తమమ్ | బ్రహ్మోదుంబరమిత్యేవం సర్వలోకేషువిశ్రుతమ్. 7 తత్రబ్రహ్మర్షికుండేషు స్నాతస్యద్విజసత్తమాః | సప్తర్షీణాం ప్రసాదేన సప్తసోమఫలంభ##వేత్. 8 భరద్వాజోగౌతమాశ్చ జమదగ్నిశ్చవశ్యపః | విశ్వామిత్రోవసిష్ఠశ్చ అత్రిశ్చ భగవాన్ఋషిః. 9 ఏతై,సమేత్యతత్కుండం కల్పితంభువి దుర్లభమ్ | బ్రహ్మాణాసేవితం యస్మాత్ బ్రహ్మోదుంబర ముచ్యతే. 10 ఓ బ్రాహ్మణోత్తములారా, మానుష తీర్థానికి తూర్పుగా క్రోశెడు దూరాన ద్విజోత్తములచే సేవిపబడునట్టి ఆపగనే ప్రసిద్ధిచెందిన నది ఉన్నది. అక్కడ పాలలోవండినేతితో కలపబడిన శ్యామక (సామధాన్యం) సరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించువారు పాపముల పొందరు. ఆనదీ తీరాన శ్రాద్ధకర్మలు జరుపువారల సర్వ కామ్యములు సిద్ధించుటకు సందేహములేదు. తమవంశంలో ఎవడైనా ఒకడు పుత్రుడు కాని పౌత్రుడు కాని ఆనదీ తీరాన తమకు తిలతర్పణం చేయువాడు పుట్టి తమకు నూరుకల్పాల వరకు సద్గతులు కలిగించునా యని పితృదేవతలు ఎదరుచూస్తూ ఉంటారుః భాద్రపద కృష్ణ పక్ష చదుర్దశినాడు విశేషించి మధ్యాహ్న సమయాన అచ్చట పిండ ప్రదానం చేయువానికి మోక్షం కలుగుతుంది. అచట నుండి బ్రహ్మకు ముఖ్యస్థానమైన బ్రహ్మోదుంబరమనే లోక విశ్రుతమైన ప్రదేశానికి వెళ్లాలి. బ్రహ్మణులారా! అచట ఉన్న బ్రహ్మర్షి కుండలలో స్నానం చేసినవాడు సప్తర్షులు అనుగ్రహం వల్ల ఏడు సోమయాగాలు చేసిన పుణ్యం. ఫలం పొందగలరు. భూలోకంలో దుర్లభ##మైన ఆ తీర్థన్ని భరద్వాజ గౌతమజమదగ్ని కశ్యపవిశ్వామిత్ర వసిష్ఠ అత్రి మహర్షులు కలిసి కల్పించారు. ఆ తీర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా సేవించినందున బ్రహ్మోదుంబర తీర్థంగా ప్రశస్తిపొందింది. తస్మింస్తీర్థవరేస్నాతో బ్రహ్మణో7వ్యక్తజన్మనః | బ్రహ్మలోకమవాప్నోతి నాత్రకార్యావిచారణా. 11 దేవాన్పితౄన్ సముద్దిశ్య యోవిప్రంభోజయిష్యతి | పితరస్తస్యసుఖితా దాస్యంతిభువిదుర్లభమ్. 12 సప్తర్షీంశ్చ సముద్దిశ్య పృథక్స్నానంసమాచరేత్ | ఋషీణాంచప్రసాదేనసప్తలోకాధిపోభ##వేత్. 13 కపిస్థలేతివిఖ్యాతం సర్వపాతకనాశనమ్ | యస్మింస్థితఃస్వయందేవోవృద్దకేదరాసంజ్ఞితః 14 తత్రస్నాత్వా7ర్చయిత్వాచ రుద్రందిండిసమనిత్వమ్ | అంతర్దానమవాస్నోతి శివలోకేసమోదతే. 15 యస్తత్రకురుతేశ్రాద్ధం శివముద్దిశ్యమానవః | చైత్రశుక్లచతుర్దశ్యాం ప్రాప్నోతి పరమంపదమ్. 16 యస్తత్రతర్పణం కృత్వాపిబతేచులుకత్రయమ్ | దిండిదేవంనమస్కృత్య కేదారస్యఫలం లభేత్. 17 కలస్యాంతుతతోగచ్చే త్యత్రదేవీస్వయంస్థితా | దుర్గాకాత్యాయనీభద్రా నిద్రామాయాసనాతనీ. 18 కలస్యాంచనరః స్నాత్వా దృష్ట్వా దుర్గదంతటేస్థితామ్ | సంసారగహనందుర్గం నిస్తరేన్నాత్రసంశయః 19 తతోగచ్ఛేతసరకం త్రైలోక్యస్యాపి దుర్లభమ్ | కృష్ణపక్షే చతుర్దశ్యాం దృష్ట్వా దేవంమహేశ్వరమ్. 20 లభ##తేసర్వకామాంశ్చ శివలోకంసగచ్ఛతిః తిస్రః కోట్యస్తుతీర్థానాం నరకేద్విజసత్తమాః. 21 ఓ బ్రాహ్మణోత్తములారా! అవ్యక్తజన్ముడగు ఆ బ్రహ్మ తీర్థాన స్నానం చేసినచో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి తిరుగులేదు. ఆ ప్రదేశాన నొక బ్రాహ్మణునకు భోజనం, పితరులనుద్దేశించి, పెట్టినచో దానసంతుష్టులై పితరులాతనికి దుర్లభ##మైన వరము లొసంగుదురు. విడిగా సప్తమహర్షులనుద్దేశించి ఆకుండంలో స్నానంచేస్తే ఆ బుషుల అనుగ్రహం వల్ల సప్తలోకాధిపత్యమూ పొందవచ్చును. సమస్తపాపాలను పోగొట్టు కపిస్థలమనే ప్రసిద్ధ తీర్థం ఉంది. అక్కడ వుద్ధకేదారేశ్వర మహాదేవుడు నెలకొని ఉన్నాడు. అక్కడ దండితో కూడియున్న రుద్రుని, స్నాతుడై అర్పించి నచో అంతర్థాన శక్తిని పొంది శివలోకంలోసుఖించవచ్చు. అచ్చట తర్పణం విడిచ ముమ్మార్లు ఆచమనం చేసిదండి దేవునకు నమస్కరించినచో కేదరాక్షేత్రాటన ఫలం పొదగలరు. చైత్రశుక్ల చతుర్దశినాడు శివునకు ప్రీతిగా అక్కడ శ్రాద్ధ మొనర్చినచో పరమపదం లభించును. అచట నుండి దుర్గ, కాత్యాయని, భద్ర, నిద్ర, మాయ సనాతనీ అనే పేర్లతో విరాజిల్లే దేవీస్థానమైన కలశాలని వెళ్ళవలెను. ఆ కలశ తీర్థంలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న దుర్గాదేవిని దర్శించినచో దుస్తరమైన సంసారసాగరాన్ని నిస్సందేహంగా దాటవచ్చు. తర్వాతముల్లోకాల్లో దుర్లభ##మైన నరక క్షేత్రాన్ని దర్శించాలి. కృష్ణ చతుర్దశినాడు అందువేంచేసిన మహాదేవుని సేవించినచో కోర్కెలన్నీ ఫలించి శివలోకం పొందవచ్చు. బ్రహ్మణులారా ! ఆ నరక క్షేత్రంలో ముక్కోటి తీర్థాలున్నవి. రుద్రకోటిస్తథాకూపే నరోమధ్యేవ్యవస్థితా | తస్మిన్సరేచయఃస్నాత్వా రుద్రకోటింస్మరేన్నరః 22 పూజితారుద్రకోటిశ్చ భవిష్యతి న సంశంయః | రుద్రాణాంచప్రసాదేన సర్వదోషవివర్జితః 23 బంద్రజ్ఞానేన సంయుక్తః పరంపదమావాప్నుయాత్ | ఇడాస్పదంచతత్రైవంతీర్థం పాపభయాపహమ్. 24 అస్మిన్ముక్తిమవాప్నోతి దర్శనాదేవమానవః | తత్రస్నాత్వా7ర్చయిత్వాచ పితృదేవగణానపి. 25 న దుర్గతిమవాప్నోతి మనసాచింతితంలభేత్ | కేదారంచమహా తీర్థం సర్వకల్మషనాశనమ్. 26 తత్రస్నాతస్తు పురుషః సర్వదానఫలం లభేత్ | కింరూపంచమహాతీర్థం తత్రైవభువిదుర్లభమ్. తస్మిన్ స్నాతస్తుపురుషః సర్వయజ్ఞపలంలభేత్. 27 సరజస్యతుపూర్వేణ తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్ అన్యజన్మసువిఖ్యాతం సర్వపాపవ్రణాశనమ్. 28 నారంసింహంవసుఃకృత్వా హత్వాదానవమూర్జితమ్ | తీర్యగ్యోనౌగతో విష్ణుః సింహేషురతిమాప్నువాన్. తతోదేవాఃసగంధర్వా అదాధ్యవరదంశివమ్ | ఊచుః ప్రణతసర్వాంగా విష్ణుదేహస్యలంభ##నే. 30 తతోదేవోమహాత్మా7సౌ శరభంరూపమాస్థితః | యుద్దంచకారయామాన దివ్యంవర్షసహస్రకమ్. యుధ్యమానౌతుతౌదేవౌ పతతౌసరమధ్యతః. 31 తస్మిన్సరస్తటేవిప్రో దేవర్షిర్నారగఃస్థితః | అశ్వత్థవృక్షమాశ్రిత్య ధ్యానస్థస్తౌదదర్శహ. 32 విష్ణుశ్చతుర్భుజోజజ్ఞే పలింగాకారఃశివఃస్థితః | తౌదృష్ట్వాతత్రపురుషౌ తుష్టావభ క్తిభావితః 33 ఆ సరోవరం మధ్య భాగాన ఉన్న ఒక బావిలో కోటి రుద్రులున్నారు. ఆ సరస్సులో స్నానంచేసి కోటి రుద్రులను స్మరించిచోట ఆ రుద్రుల అనుగ్రహం వల్ల కోటి రుద్రులను పూజించిన ఫలం లభించి సర్వదోషములు తొలగిపోవును. ఇంద్ర జ్ఞానం పొంది పరమ పదం లభించును. అక్కడే సర్వ పాపభయాలు పోద్రోలు ఇడాస్పద తీర్థం కలదు. దాని దర్శన మాత్రముననే నరులు ముక్తి పొందగలరు. అక్కడ స్నానంచేసి దేవ పితృగణాలను అర్చిస్తే కోరిన కోర్కెలు సిద్ధించును. ఎలాంటి దుర్గతులు కలుగవు. అచటనే సర్వకిల్పిషనాశకమైన కేదారతీర్థం ఉంది. అచట స్నానమాడిన మానవునకు సకల దాన ఫలమూ కలుగుతుంది. అక్కడనే భూలోకంలో దుర్లభ##మైన కింరూప తీర్థం ఉంది. ఆ మహా తీర్థంలో మునిగినచో సర్మయజ్ఞ ఫలాన్నీ పొందవచ్చు. నరక క్షేత్రానికి తూర్పు దిశగా ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందిన అన్యజన్మమనే తీర్థం ఉంది అది అన్ని పాపాలనూ నశింపచేస్తుంది. నరసింహరూపాక్రూరరాక్షసుని సంహరించిన విష్ణువు ఆ సింహరూపంలోనే ఉండి. సింహాల పట్ల మమకారం పెంచుకున్నాడు. అంతట దేవ గంధర్వాదులంతా శివుణ్ణి ఆరాధించి సాష్టాంగ ప్రణామాలు చేసి విష్ణువు ఘోరరూపాన్ని గురించి విన్నవించారు. అంతట నామహేశ్వరుడు శరభమనే మృగరూపం ధరించి నరసింహదేవునితో వేయి దివ్యవర్షాలు యుద్ధం చేశాడు. అలా పోరాడి పోరాడి చివరకా దేవులిద్దరూ సరోవరంలో పడిపోయారు. ఆ సరోవరం తీరాన ఒక రావి చెట్టు క్రింద నారద మహర్షి ధ్యానస్ధుడై యుండి ఆ విషయం చూచాడు. అలా చూస్తుండగానే విష్ణువు చతుర్భుజాకారాన్ని శివుడు లింగాకృతిని పొందినిలిచారు. ఆ పరమ పురుషుల నిద్దరిని చూచి నారదుడు భక్తితో యిలా స్తోత్రం చేశాడు. నమఃశివాయదేవాయ విష్ణవేప్రభవిష్ణువే | హరయేచఉమాభ##ర్త్రేస్థితికాభృతేనమః. 34 హరాయ బహురూపాయ విశ్వరూపాయవిష్ణవే | త్ర్యంబకాయ సుసిద్దాయ కృష్ణాయజ్ఞానహేతవే. 35 ధన్యో7హంసుకృతీ నిత్యం యద్దృష్టౌపురుషోత్తమౌ | మమాశ్రమవిదం పుణ్యం యువాభ్యాంవిమలీకృతమ్. అద్యప్రభృతి త్రైలోక్యే అన్నజన్మేతివిశ్రుతమ్. 36 యఇహాగత్య స్నాత్వాచ పితౄన్ సంతర్పయిష్యతి | తష్య శ్రద్ధాన్వితస్యేహ జ్ఞానమైంద్రంభవిష్యతి. 37 అశ్వత్థన్య తుయన్మూలం సదాతత్రవసామ్యహమ్ | అశ్వత్థవందనం కృత్వాయమంరౌద్రంనపశ్యతి. 38 తతోగచ్ఛేత విప్రేంద్రా నాగస్యహ్రదముత్తమమ్ | పౌందరీకేనరః స్నాత్వాపౌండరీకఫలంలభేత్. 39 దశమ్యాంశుక్ల పక్షస్య చైత్రస్యతువిశేషతః | స్నానంజపం తథాశ్రద్దం ముక్తిమార్గప్రదాయకమ్. 40 తతస్త్రివిష్టపం గచ్ఛేత్తీర్థందేవనిషేవితమ్ | తత్రవై తరణీ పుణ్యానదీపాపప్రమోచనీ. 41 తత్రస్నాత్వా7ర్చయిత్వాచ శూలపాణింవృషధ్వజమ్ | సర్వపాపవిశుద్ధాత్మా గచ్ఛత్యేవపరాంగతిమ్. 42 తతోగచ్ఛేత విప్రేంద్రా రసావర్తమనుత్తమమ్ | తత్రస్నాత్వా భక్తియుక్తః సిద్ధిమాప్నోత్యనుత్తమామ్. చైత్రశుక్లచతుర్దశ్యాంతీర్థేస్నాత్వామ్యలేపకే | పూజయిత్వా శివం తత్ర పాపలేపోనవిద్యతే. 44 ''శివా! నీకు నమస్కారము! దేవా| నమస్కారము. విష్ణుదేవా ప్రభవిష్ణూ! నీకు నమస్సు ! హూ ! ఉమాపతీ ! స్థితిలయ భర్తా ! నీకు నమస్కారం. బహురూపధారివగు హరా ! విశ్వరూపివయిన విష్ణూ! మీకు నమస్సులు. సిద్ధమూర్తివగు ముక్కంటీ ! జ్ఞానదాతవగు కృష్ణా! మీకు నమోవాకములు. ''నేనెంతో ధన్యుడను, సుకృతిని. పురుషోత్తములైన మిమ్ములను దర్శింపగలిగితిని. మీయిర్వురచే పవిత్రీ కృతమైన యీనా ఆశ్రమం పుణ్యస్థలం. ఈ నాటి నుండి యిది అన్యజన్మ క్షేత్రంగా ఖ్యాతి చెందగలదు. ముల్లోకాల్లో ఉత్తమమైన ఈ చోట స్నానం చేసి పితరులకు తర్పణము లిచ్చిన శ్రద్ధాళువుకు మహేంద్ర జ్ఞానం కలుగును. నేనెల్లప్పుడూ నివసించే అశ్వత్థ మూలాన్ని చూసి, ఆ వృక్షానికి వందన మొనర్చువారు భయంకరమైన యమదర్శనం చేయరు. విప్రోత్తములారా! అచట నుండి ఉత్తమమైన నాగహ్రదానికి వెళ్ళవలె. పౌండరీక తీర్జంలో స్నానం చేసినచో పౌండరీక యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. విశేషించి చైత్రశుక్లదశమి నాడచట స్నానజపశ్రాద్ధాదులు చేసి ముక్తి పొందవచ్చు. అచట నుంచి దేవతలు సేవించే త్రివిష్గపతీర్థానికి వెళ్ళాలి. అక్కడ పాప విమోచనం చేసే వైతరణీ అనే పుణ్యనది ఉన్నది. అక్కడ స్నానం చేసి శూలపాణి మహాదేవుని అర్పించినచో సర్వ పాపాలు వదలి పరమ గతిని పొందవచ్చు. ఆ తర్వాత రసావర్తమనే ఉత్తమతీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన ఉత్తమమైన సిద్ధికలుగుతుంది. చైత్రశుక్ల చతుర్దశినాడు అలేపకమను తీర్థంలో మునిగి శివపూజకావించినచో ఏ మాత్రం పాపం అంటజాలదు. తతోగచ్ఛేతవిప్రేంద్రాః ఫలకీవనముత్తమం | యత్రదేవాః సగంధర్వాః సాధ్యాశ్చఋషయఃస్థితాః తపశ్చరంతివిపులం దివ్యంవర్షసహస్రకమ్. 45 దృషద్వత్యాంనరః స్నాత్వా తర్పయిత్వాచదేవతాః | అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతిమానవః 46 సోమక్షయేచసంప్రాప్తే సోమస్యచదినే తథా | యః శ్రాద్దంకురుతేమర్త్యస్తస్యపుణ్యఫలంశృణు. 47 గయాయాంచయథాశ్రాద్దం పితౄన్ ప్రీణాతినిత్యశః | తథాశ్రాద్ధంచకర్తవ్యం ఫలకీవనమాశ్రితైః 48 మనసాస్మరతేయస్తు ఫలకీవనముత్తమం | తస్యాపి పితరస్తృప్తిం ప్రయాస్యంతినసంశయః. 49 తత్రాపి తీర్థం సుమహత్ సర్మదేవైరలం కృతమ్ | తస్మిన్ స్నాతస్తు పురషో గోసహస్ర ఫలం లభేత్. 50 పాణిఖాతే నరఃస్నాత్వా పితౄన్ సంతర్ప్యమానవః | 51 అవాప్నుయాద్ రాజసూయం సాంఖ్యయోగం చ విందతి. 52 తతోగచ్ఛేతపసుమహ త్తీర్థం మిశ్రకముత్తమమ్ | తత్రతీర్థానిమునినా మిశ్రితాని మహాత్మనా. 52 వ్యాసేన మునిశార్దూలా దధీచ్యర్థం మహాత్మనా | సర్వతీర్థేషు సస్నాతి మిత్రకేస్నాతియో నరః. 53 తతోవ్యాసవనం గచ్ఛేత్ నియతో నియతాశనః | గనోజవే నరః స్నాత్వా దృష్ట్వా దేవమణిం శివమ్. 54 మనసా చింతితంసర్వం సిద్ధ్యతే నాత్రసంశయః | గత్వామధువటీం చైవ దేవ్యాస్తీర్థం నరశ్శుచిః. 55 తత్రస్నాత్వా7ర్చయే ద్దేవాన్ పితౄంశ్చ ప్రయతోనరః | స దేవ్యాసమను జ్ఞాతో యథాసిద్ధింలభేన్నరః. 56 ఓ బ్రాహ్మణులారా ! అటనుండి ఉత్తమమైన ఫలకీవనానికి వెళ్ళాలి. అక్కడ దేవగంధర్వసాధ్యఋష్యాదులు వేయి దివ్య సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. దృషద్వతి నదిలో మునిగి దేవపితృతర్పణాదులు చేసిన మానవుడు అగ్నిష్టోమాతి రాత్ర క్రతు ఫలం పొందుతాడు. కృష్ణపక్ష సోమవారం నాడచ్చట శ్రాద్ధం పెట్టినచో కలుగు ఫలం వినండి. గయాశ్రాద్ధం పితృదేవతల నెల్లప్పుడూ ఎలా తృప్తిపరుస్తుందో అలాగే ఫలకీవనంలో గావించిన శ్రాద్ధకర్మ కూడ అంతటి ఫలాన్నీ యిస్తుంది. అంతేకాదు; మనసారాఫలకీవనాన్ని స్మరించినంత మాత్రాననే మానవుని పితరులు సంతృప్తులౌతారు. అందుకు సందేహములేదు. అక్కడే సర్వదేవతల నిలయమైన మహాతీర్థం ఒకటి ఉంది. అందులో స్నానం చేసిన వానికి వేయి ఆవులు దానం చేసినంత ఫలం లభిస్తుంది. పాణిఖాత తీర్థంలో స్నాతుడై పితృ తర్పణం చేసిన మానవునకు రాజ సూయం చేసిన ఫలం కల్గి సాంఖ్యయోగాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత అతి మహిమగల మిశ్రక తీర్ధం వస్తుంది, దథీచి మహర్షికై వ్యాసముని సర్వతీర్ధజలాలను అచట కలిపారు. ఆ మిశ్రకంలో స్నానం చేసినచో సకల తీర్ధాల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. అటనుండి నియతా హారియై నిష్ఠతో వ్యాస వనానికి వెళ్ళాలి. అక్కడ మనోజవ తీర్థంలో మునిగి దేవతారత్నం శివుని దర్శిస్తే మనుసులోని తలపులన్నీ సిద్ధించడం నిశ్చయం. అనంతరం మధువటి అనే దేవీతీర్థంలో నరుడు శుచియై స్నానం చేసి దేవపితృ తర్పణాదులు చేస్తే ఆ దేవి కృపవల్ల గొప్పసిద్ధులు లభిస్తాయి. కౌశిక్యాః సంగమేయస్తు దృషద్వత్యాం నరోత్తమః | స్నాయీతనియతాహారః సర్వపాపైః ప్రముచ్యతే. 57 తతో వ్యాసస్థలీనామ యత్రవ్యాసేన ధీమతా | పుత్రశోకాభిభూతేన దేహత్యాగాయ నిశ్చయంః . 58 కృతోదేవైశ్చ విప్రేంద్రాః పునరుత్థాపితస్తదా | అభిగమ్యస్థలీంతస్య పుత్రశోకం నవిందతి. 59 కిందత్తం కూపమాస్థాయం తిలప్రస్థం ప్రదాయ చ | గచ్ఛేత పరమాంసిద్ధిం ఋణౖర్ముక్తి మవాప్నుయాత్. అహ్నం చ సుదినం చైవ ద్వేతీర్థేభువి దుర్లభే | తయోః స్నాత్వావిశుద్ధాత్మా సూర్యలోక మవాప్నుయాత్. కృతజప్యంతతో గచ్ఛేత్ త్రిషులోకేషు విశ్రుతమ్ | తత్రాభిషేకం కుర్వీత గంగాయాంప్రయతః స్థితః 62 అర్చయిత్వా మహాదేవ మశ్వమేదఫలం లబేత్ | కోటితీర్థం చ తత్రైవ దృష్ట్వా కోటీశ్వరం ప్రభుమ్. 63 తత్రస్నాత్వాశ్రద్దధానః కోటియజ్ఞఫలం లభేత్ | తతోవామనకం గచ్ఛేత్ త్రిషులోకేషు విశ్రుతమ్. 64 యత్రవామన రూపేణ విష్ణునాప్రభవిష్ణునా | బలేరపహృతం రాజ్య మింద్రాయ ప్రతిపాదితమ్. 65 తత్రవిష్ణుపదేస్నాత్వా అర్చయిత్వా చ వామనమ్ | సర్వపాప విశుద్దాత్మా విష్ణులోక మవాప్నుయాత్. 66 నియతాహారియైన ఉత్తమనరుడు దృషద్వతీ కౌశికీ నదుల సంగమంలో స్నానం చేసినచో సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. అంతట హంసతీర్థం వస్తుంది. అక్కడనే పుత్రశోకంతో తల్లడిల్లిన వ్యాసుడు ప్రాణత్యాగానికి సిద్దపడ్డాడు. అంతట దేవతలు ఉపశమన వాక్యాలు పలికి ఆయన నిర్ణయాన్ని మార్పించారు. ఆ తీర్థంలో స్నానం చేసిన వారికి పుత్రశోకమంటూ కలుగదు. తర్వాత కిందత్తమనే తీర్థంలో ఒక ప్రస్థం (కొలత) నువ్వులు దానం చేసినచో ఋణ బాధలు తొలిగిపోయి పరమసిద్ధి లభిస్తుంది. 'అహ్నం సుదినం' అనే అతి దుర్లభాలైన తీర్థాల్లో నిర్మలాంతఃకరణుడై స్నానం చేసిన వానికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. తర్వాత ముల్లోకాల్లో ప్రసిద్ధమైన 'కృతజప' తీర్థం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి అచట గంగాస్నానం చేసి మహాదేవుని అర్పిస్తే అశ్వమేధఫలంలభిస్తుంది. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేసి శ్రద్ధా బక్తులతో కోటీశ్వర స్వామిని దర్శిస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అట నుండి మూడు లోకాల్లో ప్రసిద్ధి గాంచిని వామన క్షేత్రానికి వెళ్ళనగును. అచ్చోటనే వామన మూర్తి బలినివంచించి ఆయన రాజ్యాన్ని యింద్రునకు ప్రసాదించారు. అక్కడ విష్ణుపదీ తీర్థంలో స్నానం చేసి వామన దేవుని పూజించిన నరుడు సకల పాప విముక్తుడూ విష్ణులోకాన్ని పొందుతాడు. జ్వేష్ఠాశ్రమం చ తత్రైవ నర్వపాతకనాశనమ్ | తంతు దృష్ట్వానరో ముక్తిం సంప్రయాతిన సంశయః 67 జ్యేష్ఠేమాసి సితేపక్షే ఏకాదశ్యాముపోషితః | ద్వాదశ్యాం చ నరః స్నాత్వా జ్యేష్ఠత్వం లభ##తే నృషు. 68 తత్రప్రతిష్ఠితా విప్రా విష్ణునాప్రభా విష్ణునా | దీక్షాప్రతిష్ఠా సంయుక్తా విష్ణుప్రీణన తత్పరాః 69 తేభ్యోదత్తానిశ్రాద్ధాని దానాని వివాధాని చ | అక్షయాని భవిష్యంతి యావన్మన్వంతరస్థితిః. 70 తత్రైవకోటి తీర్థం చ త్రిషులోకేషు విశ్రుతమ్ | తస్మిన్ తీర్థేనరః స్నాత్వా కోటియజ్ఞఫలం లభేత్. 71 కోటీశ్వరం నరోదృష్ట్వా తస్మింస్తీర్థేమహేశ్వరమ్ | మహాదేవ ప్రసాదేన గాణసత్యమవాప్నుయాత్. 72 తత్రైవ సుమహత్తీర్థం సూర్యస్య చ మహాత్మనః | తస్మిన్ స్నాత్వాభక్తియుక్తః సూర్యలోకే మహీయతే. తతోగచ్ఛేత విప్రేంద్రాస్ తీర్థంకల్మషనాశనమ్ | కులోత్తారణనామానం విష్ణునామకల్పితం పురా. 74 వర్ణానామాశ్రమాణాం చ తారణాయ సునిర్మలమ్ | బ్రహ్మచర్యాత్పరం మోక్షం యఇచ్ఛంతిసునిర్మలమ్. తే7పితత్తీర్థమాసాద్య పశ్యన్తి పరమంపదమ్. 75 బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్ధోయతిస్తథా | కులానితారయేత్ స్నాతః సప్తసప్తచసప్తచ. 76 బ్రహ్మణాః క్షత్రియావైశ్యాః శూద్రావైతత్పరాయణాః | స్నాతాభక్తి యుతాఃసర్వే పశ్యంతి పరమం పదమ్. దూపస్థో7పి స్మరేద్యస్తు కురుక్షేత్రం స వామనమ్ | సో7పిముక్తిమవాప్నోతి కింకపునర్నివసన్నరః 78 ఇతి శ్రీ వావన మహాపురాణ సరోమాహాత్మ్యే పంచదశోధ్యాయః. బ్రాహ్మణోత్తములారా ! అక్కడనే సకలపాపనాశనియైన జ్యేష్ఠాశ్రమం ఉండి. దాని దర్శనమాత్రాన్నే నరుడు ముక్తుడౌతాడు. ఇతి తథ్యం. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడుపవసించి ద్వాదశినాడా తీర్థంలో స్నానంచేస్తే తోటివారిలో శ్రేష్ఠత్వం లభిస్తుంది. ఆ చోట అత్యంతవ్రత దీక్షాపరులు పవిత్రులయిన బ్రాహ్మణులను విష్ణుభగవానుడు నిలిపినాడు. ఆ విష్ణుభక్తులు కొసగుదానములు, అచట జరుపబడు శ్రద్ధములు అక్షయమైమన్వంతరాంతంవరకూ వానికర్తలకు ఫలములిస్తూ ఉంటవి. అక్కడే త్రిభువన ప్రసిద్ధమైన కోటితీర్థం ఉండి. దానిలోస్నానం చేసిన వారలకు కోటియజ్ఞఫలం కలుగుతుంది. ఆ తీర్థంలో కోటీశ్వరమహాదేవుని దర్శనంచేస్తే ఆస్వామి కృపవల్ల గణాధిపత్యం లభిస్తుంది. ఆ చోటనే మహిమాన్వితమైన సూర్యతీర్థం ఉంది. అక్కడభక్తియుక్తుడై స్నానంచేయువాడు సూర్యలోకానికి పోతాడు. అచటనుంచి సకలకల్మషనాశకమైన కులోత్తారణ తీర్థానికి వెళ్లాలి. సకలవర్ణాశ్రమవాసులనూ ఉద్దరించుటకై దానిని స్వయంగా విష్ణుభగవానుడే పూర్వం జన్మించాడు. బ్రహ్మ చర్యానంతరమే మోక్షం పొందవలెననికోరే వారాతీర్థంలో ప్రవేశించినంతనే పరమపదాన్ని దర్శిస్తారు. ఆ తీర్థంలో స్నానం చేసిన బ్రహ్మచారిగానీ, గృహమేధికానీ వానప్రస్థుడుకానీ లేక యతీశ్వరుడు కానీ తమ యిరవై యొక్క తరాలవారిని తరింప చేస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులతో ఏవరైనా విష్ణుభక్తితత్పరులై అక్కడ స్నానంచేసి విష్ణుపదాన్ని దర్శించగలరు. వామనదేవుని సహితంగా ఈ కురుక్షేత్రాన్ని ఎంతదూరంగా ఉన్న వారైనాసరే భక్తితో స్మరిస్తేచాలు. వారలకు ముక్తి కలిగితీరుతుంది. అలాంటప్పుడు ఆ పవిత్రభూమిలో నివసించే వారిభాగ్య విషయం చెప్పతరమా ! ఇది శ్రీ వామన మహా పురాణంలోని సరోమాహాత్వ్యంలో పదిహేనవ అధ్యాయం సమాప్తం.