Sri Vamana Mahapuranam
Chapters
పదిహేడవ అధ్యాయము ఋషయః ఊచుః : కథంమంకణకః సిద్ధః కస్మాజ్ఞాతోమహానృషిః | నృత్యమానస్తుదేవేన కిమర్థంసనివారితః 1 లోమహర్షణవాచ : కశ్యపశ్యసుతోజజ్ఞేమానసోమంకణోమునిః | స్నానంకర్తుంవ్యవసితో గృహీత్వావల్కలంద్విజః 2 తత్రగత్వాహ్యప్సరసో రంభాద్యాః ప్రయదర్శనాః | స్నాయంతిరుచిరాః స్నిగ్థాస్తేన సార్ధమనిందితాః 3 తతోమునేస్తధా క్షోభా ద్రేతః స్కన్నంయదంభసి | తద్రేతఃసతు జగ్రాహ కలశేవైమహాతపాః 4 సప్తధాప్రవిభాగంతు కలశస్ధం జగామహా | తత్రర్షయఃసప్త జాతా విదుర్యాన్ మరుతాంగణాన్. 5 వాయువేగోవాయుబలో వాయుహా వాయుమండలః | వాయుజ్వాలోవాయురేతో వాయుచక్రశ్చ వీర్యవాన్. 6 ఏతేహ్యపత్యాస్తస్యర్షే ర్దారయంతి చరాచరమ్ | పురామంకణకః సిద్దః కుశాగ్రేణతి మేశ్రుతమ్. 7 క్షతఃకిలకరేవిప్రా స్తస్య శారసో7స్రవత్ | సవైశాకరసందృష్ట్వా హర్షావిష్టః ప్రనృత్తవాన్. 8 తతఃసర్వంప్రనృత్తంచ స్థావరంజంగమంచయత్ | ప్రనృత్తంచ జగద్దృష్ట్వా తేజసా తస్యమోహితమ్. 9 బ్రహ్మాదిభిః సురైస్తత్రఋషిభిశ్చతపోధనైః | విజ్ఞప్తోవై మహాదేవో మునేరర్థే ద్విజోత్తమాః. 10 నాయంనృత్యేద్ యథాదేవః తథాత్వంకర్తుమర్హసి | తతోదేవోమునిం దృష్ట్వా హర్షావిష్టమతీవహి. 11 సురాణాంహిత కామార్థం మహదేవో7భ్యభాషత | హర్షస్థానంకింమర్థంచ తవేదం మునసత్తమః తపస్వినోధర్మపథే స్థితస్యద్వజసత్తమ. 12 ఋషులు ప్రశ్నించారు : మంకణకుడెలా సిద్ధుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు ? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడేల నివారించాడు ? అందులకు రోమహర్షణుడిలా చెప్పాడు. మంకణముని కశ్యపమహర్షి మానసపుత్రుడు. ఒకానాడాయన పల్కలాలతో స్నానంచేయనుద్యుక్తుడయ్యాడు. బ్రాహ్మణులారా ! అప్పుడచటకు సుందరులు ప్రియదర్శనలు కోమలాంగులయిన రంభాది అప్సరసలుకూడ వచ్చి ఆయనతోబాటు స్నానంచేయసాగారు. వారలను చూచి మనస్సు చలించి నందున ఆ ముని వీర్యం నీటిలోజారిపడగా నాతపస్వి దనానొక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం ఏడుభాగాలయి అందలోనుండి సప్తమరుద్గణాలు, వాయువేగ, వాయుబల, మయుహా, ముమండల, వాయుజ్వాల, వాయురేత, వాయు చక్రులను మహావీర్యవంతులుద్భవించారు. ఆ ఋషికిపుట్టిన ఆ ఏడుగురు కుమారులు ఈ చరాచరజగత్తును ధరించియున్నారు. సిద్ధపురుషుడైన ఆ మంకణకుడు పూర్వమొకసారి కుశాగ్రలతో చేయికోసుకున్నట్లు ఆ వ్రణంలోనుండి శాకరసంస్రవించినట్లు విన్నాను. చేతినుండి కారుచున్న ఆశాకరసాన్ని చూచి ఆయన ఆనందంలో నాట్యంచేయసాగాడు. ఆ నాట్యోద్ధతికి స్థావర జంగమాలల్నీ నాట్యం చేయసాగాయి. ఆయన తేజస్సుకు మోహంచెంది జగత్తంతానాట్యం చేయడంతో బ్రహ్మాదిదేవతలు తపోధనులయిన ఋషులందరుకలిసి మహాదేవుని దర్శించి యిలా ప్రార్థించారు. ప్రభూ ! ఈ మునిని నృత్యంచేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షోన్మత్తుడయిన మునినిచూచి దేవహితం కోసమై యిలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమా ! ఓ బ్రాహ్మణోత్తమా ! ధర్మపథాన నడచుచున్న నీకింతటి హర్షాతిరేకం కలుగుటకు కారణమేమిటో చెప్పవలయును. ఋషిరువాచ : కింనపశ్యసిమేబ్రహ్మన్కరాచ్ఛాకరసంస్రుతమ్?|యందృష్ట్వాహంనృత్తోవైహర్షేణమహతా7న్వితః. 13 తంప్రహస్యాబ్రవీద్దేవో మునింరాగేణమోహితమ్ | అహంనవిస్మయంవిప్రః గచ్ఛామీహప్రవశ్యతామ్. 14 ఏవముక్త్వామునిశ్రేష్ఠం దేవదేవోమహాద్యుతిః | అంగుళ్యగ్రేణవిప్రేంద్రాం స్వాంగుష్ఠంతాడయద్భవః. 15 తతోభస్మక్షతాత్తస్మా న్నిర్గతంహిమసన్నిభమ్ | తద్దృష్ట్వావ్రీడితోవిప్రః పాదయోః పతితో7బ్రవీత్. 16 నాన్యందేవాదహంమన్యేశూలపాణర్మహాత్మనః | చరాచరస్యజగతో వరస్త్వమసిశూలదృక్. 17 త్వదాశ్రయాశ్చదృశ్యంతే సురాబ్రహ్మాదయో7నఘ | పూర్వస్త్వమసిదేవానాం కర్తాకరయతామహత్. 18 త్రత్ప్రసాదాత్సురాస్సర్వే మోదంతేహ్యకుతోభయాః | ఏవంస్తుత్త్వామహాదేవం ఋషిఃనప్రణతో7బ్రవీత్. 19 భగవంస్త్వత్ప్రసాదాద్ది తపోమేనక్షయంవ్రజేత్ | తతోదేవః ప్రసన్నాత్మా తమృషింవాక్యమబ్రవీత్. 20 ఈశ్వర ఉవాచ : తపస్తేవర్ధతాంవిప్రః మత్ప్రసాదాత్ సహస్రధా | ఆవ్రమేచేహవత్ప్యామి త్వయా సార్థమహంసదా. 21 సప్తసారస్వతేస్నాత్వా యోమామర్చిష్యతే నరః | నతస్యదుర్లభంకించి దిహలోకేపరత్రచ. 22 సారస్వతంచతంలోకం గమిష్యతి నసంశయః | శిస్యచప్రసాదేన ప్రాప్నోతి పరమంపదమ్. 23 ఇతి శ్రీవామనహాపురాణ సరోమహాత్మ్యే సప్తదశో7ధ్యాయః. మంకణఋషి యిలా అన్నాడు. భగవాన్ ! నాచేతినుండి కారుచున్న శాకరసాన్ని చూడటంలేదా? దానినిచూచియే ఆనందంతో గంతులు వేస్తున్నాను. ఆ మాటకునవ్వి పరమేశ్వరుడిలా అన్నాడు. ఓ రాగమోహితుడనైన మునీ ! ఇందులో నాకేమి ఆశ్చర్యం కనిపించుటలేదు ! ఆమాట చెప్పి ఆ మహాతేజస్వియైన దేవదేవుడు తనవ్రేలి చివరభాగంతో బొటనవ్రేలిని ప్రహరించాడు. అంతట అందులో నుంచి తెల్లనిమంచులాంటి భస్మం బయటకు వచ్చింది. అది చూచి సిగ్గుపడి ఆ వంకణుడు పరమేశ్వరుని పాదాలమీదవ్రాలి యిలా ప్రార్థించాడు. ప్రభూ ! శంకరా! నిన్నుమించిన దేవుడున్నాడని నేననుకోను. చరా చరజగత్తులో శూలపాణివగు నీవే శ్రేష్టుడవు. ఈ బ్రహ్మాదిదేవతలంతా నిన్నాశ్రయించి బ్రతుకుచున్నారు. ఓ అనఘా! దేవ శ్రేణిలో అగ్రస్ధానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడపుతున్నవాడవు నీవే. నీ అనుగ్రహంవల్లనే దేవతలంతా ఎవరివల్లా ఏలాంటి భయంలేకుండా మనుగడ సాగిస్తున్నాడు. ఈ విధంగా స్తుతించి. ఆ ఋషి పరమేశ్వరుని పాదాల పట్టుకొని యిలా అన్నాడు. భగవాన్ ! నీదయవల్ల నాతపస్సు నశింపకుండుగాక. అలా అనుగ్రహించుము. అందులకు ఈశ్వరుడిలా అన్నాడు. నీతోబాటు ఈ ఆశ్రమంలో నేనుకూడా ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానంచేసి నన్నర్చించినవానికి ఇహలోకంలోనూ పరలోకంలోకూడా లభించనిదేమీ ఉండదు. శివానుగ్రహంవల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నతపదం పొందుతారు. సారస్వత స్వర్గసౌఖ్యాలనుభవిస్తారు. ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోవరమహాత్మ్యంలో పదునేడవ అధ్యాయము సమాప్తము.