Sri Vamana Mahapuranam
Chapters
ఇరువది ఏడవ అధ్యాయము సనత్కుమారఉవాచ : అథైనమబ్రవీద్దేవ సై#్త్రలోక్యాధిపతిర్భవః | అశ్వాసనకరంచాస్య వాక్యవిద్వాక్యముత్తమమ్.
1 అహోతుష్టో7స్మితే రాజన్ స్తవేనానేనసువ్రత | బహునా7త్రకిముక్తేన మత్సమీపేవసిష్యసి. 2 ఉషిత్వాసుచిరంకాలం మమగాత్రోద్భవంపునః | అసురోహ్యంధకోనామ భవిష్యసిసురాంతకృత్. 3 హిరణ్యాక్షగృహేజన్మ ప్రాప్యవృద్దింగమిష్యసి | పూర్వాధర్మేణ ఘోరేణ వేదనిందా కృతేనచ. 4 సాభిలాషోజగన్మాతు ర్భవిష్యసియదాతదా | దేహంశూలేనహత్వాహం పావయిష్యామి సమార్బుదమ్. 5 తత్రాప్యకల్మషోభూత్వా స్తుత్వామాంభక్తితః పునః | ఖ్యాతోగణాధిపోభూత్వా నామ్నాభృంగిరిటిఃస్మృతః. మత్సన్నిధానేస్థిత్వాం తతఃసిద్ధిం గమిష్యసి | వేనప్రోక్తం స్తవమిమం కీర్తయేద్యఃశృణోతిచ. 7 నాశుభంప్రాప్నుయాత్కించి ద్దీర్ఘమాయురవాప్నుయాత్ | దేవేషుయథాసర్వేషు విశిష్టోభగవాన్ శివః. 8 తథాస్తవోపరిష్ఠో7యంస్తవానాంవేసనిర్మితః| యశోరాజ్యసుఖైశ్వర్యధనమానాయకీర్తితః.9 శ్రోతవ్యోభక్తిమాస్థాయవిద్యాకామైశ్చయత్నతః|వ్యాధితోదుఃఖితోదీనశ్చౌరరాజభయాన్వితః.10 రాజకార్యవిముక్తోవా ముచ్యతేమహతోభయత్ | అనేనైవతుదేహేన గణానాంశ్రేష్ఠతాంవ్రజేత్. 11 తేజసాయశసాచైవ యుక్తోభవతి నిర్మలః | నరాక్షసాఃపిశాచావా నభూతానవినాయకాః. 12 విఘ్నంకుర్యుర్గృ హేతత్ర యత్రాయంపఠ్యతేస్తవః | శృణుయాద్వాస్తవం నారీ అనుజ్ఞాంప్రాప్యభర్తృతః. మాతృపక్షేపితుఃపక్షే పూజ్యాభవతిదేవవత్ | శృణుయద్ యఃస్తవం దివ్యం కీర్తయేద్వాసమాహితః. 14 తస్యసర్వాణికర్మాణి సిద్ధింగచ్ఛంతి నిత్యశః | మనసాచింతితంయచ్చ యచ్చవాచాను కీర్తితమ్. 15 సర్వంసంపద్యతేతస్య స్తవనస్యానుకీర్తనాత్ | మనసాకర్మణావాచ కృతమేనో వినశ్యతి | వరంపరయభద్రంతే యత్త్వయామనసేప్సితమ్. 16 సనత్కుమారుడిలా అన్నాడు : అంతట త్రిలోకేశ్వరుడైన శివుడు, వాక్య కోవిదుడు, వేనునకు తృప్తిగొలుపు నట్టి ఉత్తమ వాక్యాలు మాటాడాడు - 'భళీ! సువ్రతుడవగు రాజా! నీ స్తోత్రానికి నేను సంతోషించాను. వేయేల నీవెల్లప్పుడు నా సమీపాననే నివసించ గలవు. చాలా కాలం నావద్ద ఉండి, అనంతరం నా శరీరం నుంచియే జన్మించి, అంధకాసురడనే దేవాంతకుడవు కాగలవు. వెనుక నీవు కావించిన, వేదనిందా పూర్వకమైన అధర్మాచరణం వల్ల హిరణ్యాక్షుని యింట్లో పుట్టి పెద్దవాడవు కాగలవు. ఆ జన్మలో నీవు ఎప్పుడు జగన్మాతపై మరులు చెందుదువో అప్పుడు నేను శూలంతో నీ దేహాన్ని ఛేదించి నిన్ను అర్బుదునివలె పవిత్రుణ్ణి చేస్తాను. అప్పుడు కూడా యీవిధంగా నన్ను స్తోత్రంచేసి మెప్పించిన నా శివగణాలలో ప్రథముడుగా భృంగిరిటి అనే పేరుతో ప్రసిద్ధి చెందగలవు. నా సన్నిధిలో ఉంటూ నీవు సిద్ధి పొందెదవు. వేనుడు కావించిన ఈ దివ్య స్తోత్రాన్ని చదువువారలు, వినువారలు, ఎట్టి అశుభాలు లేకుండా దీర్ఘాయుష్మంతులగుదురు. సర్వదేవతలలో శివునకు వలెనే సర్వస్తోత్రాల్లో ఈ వేనస్తవం విశిష్టతను కలిగిఉంటుంది. యశో రాజ్యసుఖం, ఐశ్వర్య ధన గౌరవాలు ప్రదానం చేసే దిగా ఈ స్తవం కీర్తి గావించింది. విద్యార్థులు దీనిని భక్తితో వినాలి. వ్యాధి పీడితులు, దుఃఖార్తులు, దీనులు, చోరరాజ భయాన్వితులు ప్రయత్న పూర్వకంగా దీనిని శ్రవణం చేయాలి. రాజ సేవ నుండి తొలగింపబడినవారు సర్వభయాల నుండి ముక్తులౌతారు. ఈ దేహంతోనే గణాలలో శ్రేష్ఠులౌతారు : యశోతేజఃసమన్వితులై పవిత్రులౌతారు. ఈ స్తోత్రం పాఠం జరిగి గృహాలలో రాక్షస పిశాచ భూత వినాయకులెటువంటి విఘ్నాలూ కలుగజేయలేరు. భర్త అనుమతితో ఈ స్తవాన్ని గృహిణులు వింటే వారలు అటు మాతృ పక్షాన, ఇటు పితృ వంశాన దేవతలుగా పూజింపబడతారు. ఎవరైతే ఈ స్తవాన్ని రోజు మానసిక ఏకాగ్రతతో గానం చేస్తారో, అథవా వింటారో వారల సర్వకార్యాలు సిద్ధిస్తాయి. వారలు మనస్సులో సంకల్పించినవీ నోట ఉచ్చరించినవీ అన్నీ సిద్ధిస్తాయి. త్రికరణాల ద్వారా చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇక నీకు శభమగుగాక. నీకు కావలసిన వరము కోరుకొనుము. వేన ఉవాచ : అస్యలింగస్యమాహాత్మ్యాత్ తథాలింగస్యదర్శనాత్ | ముక్తో7హంపాతకైః సర్వై స్తవదర్శనతః కిలః 17 యదితుష్టో7సిమేదేవ యదిదేయోవరోమమ | దేవస్వభక్షణాజ్ఞాతం శ్వయోనౌతవసేవకమ్. 18 ఏతస్యాపిప్రసాదంత్వం కర్తుమర్హసిశంకర | ఏతస్యాపిభయాన్మధ్యే సరసో7హంనిమజ్జతః. 19 దేవైర్నివారితఃపూర్వం తీర్థే7స్మిన్ స్నానకారణాత్ | అయంకృతోపకారశ్చ ఏతదర్థేవృణోమ్యహమ్. 20 తసై#్యతద్వచనం శ్రుత్వా తుష్టఃప్రోవాచశంకరః | ఏషో7పిపాపనిర్ముక్తో భవిష్యతినసంశయః. 21 ప్రసాదాన్మేమహాబాహో శివలోకం గమిష్యతి | తథాస్తవమిమంశ్రుత్వా ముచ్యతేసర్వపాతకైః. 22 కురుక్షేత్రస్యమాహాత్మ్యం సరసో7స్యమహీపతే |మమలింగస్యచోత్పత్తిం శ్రుత్వాపాపైఃప్రముచ్యతే. 23 సనత్కుమార ఉవాచ : ఇత్యేవముక్త్వాభగవాన్ సర్వలోకమస్కృతః | పశ్యతాంసర్వలోకానాం తత్రైవాంతరధీయత. 24 సచశ్వాతత్ క్షణాదేవ స్మృత్వాజన్మపురాతనమ్ | దివ్యమూర్తిధరోభూత్వా తంరాజనముపస్థితః. 25 కృత్వాస్నానంతతోవైన్యః పితృదర్శనలాలసః | స్థాణుతీర్థేకుటీంశూన్యాం దృష్ట్వాశోకసమన్వితః. 26 దృష్ట్వావేనో 7బ్రవీద్వాక్యం హర్షేణమహతా7న్వితః | సత్పుత్రేణత్వయావత్సః త్రాతో7హంనరకార్ణవాత్. త్వయాభిషించితోనిత్యం తీర్థస్థపులినేస్థితః | అస్యసాధోఃప్రసాదేవ స్థాణోర్దేవస్యదర్శనాత్. 28 ముక్తపాపశ్చస్వర్లోకం యాస్యేయత్రశివఃస్థితః | ఇత్యేవముక్త్వారాజానం ప్రతిష్ఠాస్యమ మహేశ్వరమ్. 29 స్థాణుతీర్థేయ¸°సిద్ధిం తేనపుత్రేణతాతితః | స చశ్వా పరమాంసిద్దిం స్థాణుతీర్థప్రభావతః. 30 విముక్తకలుషైః సర్వై ర్జగామభవమందిరమ్ | రాజాపితృఋణౖర్ముక్తః పరిపాల్యవసుంధరామ్. 31 పుత్రానుత్పాద్యధర్మేణ కృత్వాయజ్ఞంనిరర్గలమ్ |దత్వాకామాంశ్చ విప్రేభ్యోభుక్తాభోగాన్ పృథగ్విధాన్. సుహృదో7థఋణౖర్ముక్త్వా కామైఃసంతర్ప్యచస్త్రియః | అభిషిచ్యసుతంరాజ్యే కురుక్షేత్రం య¸°నృపః. తత్రతప్త్వాతపోఘోరం పూజయిత్వాచ శంకరమ్ | ఆత్మేచ్ఛయాతనుంత్యక్త్వా ప్రయాతఃపరమంపదమ్. ఏతత్ర్పభావంతీర్థస్య స్థాణోర్యః శృణుయాన్నరః | సర్వపాపవినిర్ముక్తః ప్రయాతిపరమాంగతిమ్ . 35 ఇతి శ్రీ వామన మహాపురాణ సరోమాహాత్మ్యే సప్తవింశో7ధ్యాయః. వేనుడిలా విన్నవించాడు. "ప్రభో ! శంకరా ! ఈ లింగ మహాత్మ్యదర్శనాల వల్ల నీ దివ్య దర్శనం వల్లా నేను సకల పాపాల నుంచి విముక్తుడనైనాను. నీవు నా యెడ ప్రసన్నుడవై వరమివ్వనెంచినచో, దేవద్రవ్య భక్షణం కారణంగా శునక యోనిలో పుట్టిన ఈ నీ సేవకునిగూడ అనుగ్రహించుము. ఈ శునకానికి భయపడియే నేనీ సరస్సులో మునుగుట జరిగినది. మొదట నన్నీతీర్థంలో స్నానంచేయవద్దని దేవతలు శాసించారు. ఆ పని నా చేత చేయించి ఈ శునకం నాకు మహోపకారం చేసింది. కనుకనే నేను మిమ్ములనీ వరం అర్థిస్తున్నాను. ఈ కుక్కకు ముక్తి నివ్వండి" వేమని మాటలు విని శంకరుడు సంతోషించి, తప్పకుండా ఈ శునకం కూడ పాపముక్తిని పొందుతుందని చెప్పాడు. " నా అనుగ్రహం వల్ల దీనికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. నా యీ స్తవం విన్నందున దీని పాపాలన్నీ పోతాయి. ఓ రాజా ! ఈ కురుక్షేత్ర మహిమ, ఈ సరస్సు మహాత్మ్యం నాలింగోత్పత్తి వృత్తాంతం విన్నవారు పాపముక్తులౌతారు. సనత్కుమారుడింకా యిలా అన్నాడు. సర్వలోక వంద్యుడైన ఆ పరమ శివుడిలా ఆనతిచ్చి అందరూ చూస్తుండగా అక్కడే అంతర్హితుడైనాడు. ఆ కుక్కకు వెంటనే పూర్వజన్మ స్మృతి కలిగి దివ్యదేహంతో రాజు ఎదుట నిలచినది. ఇక అక్కడ వేమని పుత్రుడు తీర్థస్నానం చేసి తండ్రిని చూచుటకై తిరిగి వచ్చి కుటీరం శూన్యంగా ఉండటం చూచి ఎంతో దుఃఖించాడు. అప్పుడు మహా సంతోషంతో తన ఉత్తమ పుత్రునిచూచి వేనుడిలా అన్నాడు. " వత్సా! నీలాంటి సత్పుత్రుని పొంది నేను నరక సముద్రాన్నుంచి తప్పించుకున్నాను. నీవు రోజూ నాకు చేసిన తీర్థ జలాభిషేచనం, ఈ మహనీయుని (కుక్క) అనుగ్రహం , ఈ తీర్థ తీర నివాసం, స్థాణుదేవుని దర్మనానుగ్రహంవల్ల పాపముక్తుడనై స్వర్లోకానికి, శివలోకానికి వెళ్తున్నాను .అట్లు కుమారుని అభినందించి అచట మహేశ్వర ప్రతిష్ఠ గావించి ఆ స్థాణు తీర్థంలో పుత్రునివల్ల నుద్ధరింపబడిన ఆవేనుడు సిద్దిబొందాడు. ఆ కుక్క కూడా ఆ స్థాణుతీర్థమహిమవల్ల సర్వకల్మషాలు తొలగి శివమందిరాన్ని చేరింది. ఆ రాజుకూడ అలా పితృఋణాన్ని తీర్చుకొని, చక్కగా భూమి పాలనం చేసి, ధర్మమార్గాన పుత్రవంతుడై నిర్విఘ్నంగా యజ్ఞంచేసి, బ్రాహ్మణుల కోర్కెలుదీర్చి, సకల విధాల సుఖాలు అనుభవించి బంధుమిత్రులను ఋణవిముక్తుల గావించి, భార్యల కోర్కెలన్నియు తీర్చి, తనకుమారునకు రాజ్యాభిషేకం గావించి చివరకు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఆ పవిత్రక్షేత్రంలో ఘోరతపస్సు గావించి శంకరుని పూజించి స్వేచ్ఛతో శరీరం వదలి పరమపదాన్ని చేరాడు. ఈ స్థాణుతీర్థ ప్రభావం స్థాణ్వీశ్వరుని మహిమను శ్రద్ధగా శ్రవణం గావించిన వారలు సర్వపాపాలు వదలి పరమగతిని చేరుకుంటారు. ఇది శ్రీ వామనపురాణం సరోమాహాత్మ్యంలో ఇరువదియేడవ అధ్యాయం.