Sri Vamana Mahapuranam
Chapters
ఇరువది ఏడవ అధ్యాయము పులస్త్య ఉవాచ : సమాగతాన్సురాన్దృష్ట్వా నందిరాఖ్యాతవాన్విభోః | ఆథోత్థాయహరింభక్త్యా పరిష్యజ్యన్యపీడయత్. 1 బ్రహ్మాణం శిరసానత్వా సమాభాష్యశతక్రతుమ్ | అలోక్యాన్యాన్సురగణాన్సంభావయత్సశంకరః. 2 గణాశ్చజయదేవేతి వీరభద్రపురోగమాః | శైవాఃపాశుపతాద్యాశ్చ వివిశుర్మందరాచలమ్. 3 తతస్తస్మాన్మహాశైలం కైలాసంసహదైవతైః జగామభగవాన్ శర్వః కర్తుంవై వాహికంవిధిమ్. 4 తతస్తస్మిన్మహాశైలే దేవమాతా7దితిఃశుభా | సురభిఃసురసాచాన్యా శ్చక్రుర్మండనమాకులాః. 5 మహాస్థిశేఖరీచారురోచనాతిలకోహరః | సింహాజినీచాలినీలభుజంగకృతకుండలః. 6 మహాహిరత్నవలయో హారకేయూరనూపురః | సమున్నతజటాభారో వృషభస్థోవిరాజితే. 7 తస్యాగ్రతోగణాఃసై#్వసై#్వ రారూఢాయాంతివాహనైః | దేవాశ్చపృష్ఠతోజగ్ము ర్హుతాశనపురోగమాః. 8 వైనతేయంసమారుఢః సహలక్ష్మ్యాజనార్దనః | ప్రయాతిదేవపార్శ్వస్థో హంసేనచపితామహః. 9 గజాధిరూఢోదేవేంద్ర శ్ఛత్రంశుక్లపటవింభుః | ధారయామాసవితతం శచ్యాసహసహస్రదృక్. 10 యమునాసరితాంశ్రేష్ఠా వాఅవ్యజనముత్తమమ్ | శ్వేతంప్రగృహ్యహస్తేన కచ్ఛపేసంస్థితాయ¸°. 11 హంసకుందేందుసంకాశం వాలవ్యజనముత్తమమ్ | సరస్వతీసరిచ్ఛ్రేష్ఠాగజారూఢాసమాదదే. 12 ఋతవఃషట్సమాదాయ కుసుమంగంధసంయుతమ్ | పంచవర్ణంమహేశానం జగ్ముస్తేకామచారిణః 13 మత్తమైరావణనిభం గజమారుహ్యవేగవాన్ | అనులేపనమదాయ య¸°తత్రపృథూదకః. 14 గంధర్వాస్తుంబురుముఖా గాయంతో మధురస్వరమ్ | అనుజగ్ముర్మహాదేవం వాయందశ్చకిన్నరాః. 15 పులస్త్య మహర్షి చెప్ప మొదలుపెట్టాడు. అక్కడ చేరిన దేవతలను చూచి నంది ఏదో అనగా మహేశ్వరుడు లేచి భక్తితో శ్రీహరిని కౌగిలించుకున్నాడు. అంతట బ్రహ్మకు నమస్కరించి ఇంద్రుని సంభావించి యితర పదేవతలనందరను యథోచితంగా పలకరించాడు. వీరభద్ర పురోగాములై శివగణాలు పాశుపతగణాలు జయజయ ధ్వానాలు చేస్తూ మందరగిరి చేరారు. అక్కడ నుండి దేవగణాలతో కూడి మహేశ్వరుడు వైవాహిక విధినిర్వహణకై కైలాస శిఖరాలకు వెళ్లాడు. ఆ కొండ మీద దేవమాత అదితి, సురభి, సురస మొదలగు ముత్తైదువలు అలంకరణ కార్యంలో నిమగ్నులయ్యారు. ముఖాన గోరోచన తిలకం, మహాస్థి మకుటం, సింహచర్మం, తుమ్మెదల్లాంటి నల్లటి సర్పకుండలాలు, నాగమణులు కూర్చిన కంకణ, హారకేయూర రూపురాలు, ఎత్తైన జటాభారం ధరించి వృషభారూఢుడై హరుడు అపూర్వమైన శోభతో కనులకు విందు గావించాడు. ఆయనకు ముందు భాగాన శివగణాలందరూ తమతమ వాహనాల మీద వెళ్లగా వెనుక భాగాన అగ్నిని ముందుంచుకొని దేవతలు నడిచారు. నారాయణుడు లక్ష్మిదేవితో గరుత్మంతుని మీద బయలుదేరాడు. బ్రహ్మహంసనెక్కి శివుని ప్రక్కగా సాగాడు. శ్వేత వస్త్ర ఛత్రాలు ధరించి ఐరావతంమీద యింద్రుడు శచీదేవితో కలసి నడిచాడు. సరచ్ఛిరోమణి యమున శ్వేతచామరం పట్టుకొని తాబేలుమీద బయలుదేరింది. అలాగే సరస్వతీ, హంసకుందేండు ధవళ##మైన చామరంతో గజాన్ని ఆరోహించి పయన మైంది. ఆరు ఋతువులు పంచవన్నెల పరిమళ భరిత కుసుమాలతో హరుని అనుగమించాయి. ఐరావతం వంటి మదపు టేనుగునెక్కి అనులేపన (అలంకరణ) దృశ్యాలు తీసికొని వృథూదక తీర్థం బయలుదేరింది. తుంబురు గంధర్వులు కల కంఠాలతో గానం చేస్తున్నారు. కిన్నరులు బాజాలు వాయిస్తున్నారు. నృత్యంత్యో7ప్సరసశ్చైవ స్తువంతోమునయశ్చతమ్ | గంధర్వాయాంతిదేవేశం త్రినేత్రంశూలపాణినమ్. 16 ఏకాదశతథాకోట్యో రుద్రాణాంతత్రవైయయుం | ద్వాదశైవాదితేయానా మష్టౌకోట్యోవసూనపి. 17 సప్తవస్టిస్తథాకోట్యో గణానామృషిసత్తమ | చతుర్వింశత్తథా జగ్ముర్ ఋషీణాం ఊర్ధ్వరేతసామ్. 18 అసంఖ్యాతానియూథాని యక్షకిన్నరరక్షసామ్ | అనుజగ్ముర్మహేశానం వివాహాయసమాకులాః. 19 తతఃక్షణనదేవేశః క్ష్మాధరాధిపతేస్తలమ్ | సంప్రాప్తస్త్వాగమన్ శైలాః కుంజరస్థాఃసమంతతః. 20 తతోననామభగవాం స్త్రినేత్రః స్థావరాధిపమ్ | శైలాఃవ్రణమురీశానం తతో7సౌ ముదితోభవత్. 21 సమంసురైః పార్షదైశ్చ వివేశవృషకేతనం | నందినాదర్శితేమార్గే శైలరాజపురంమహత్. 22 జీయూతకేతురాయూత ఇత్యేవంనగరస్త్రియః | నిజంకర్మపరిత్యజ్య దర్శనవ్యాపృతాభవన్. 23 మాల్యార్దమన్యాచాదాయ కరేణౖ కేనభామినీ | కేశపాశంద్వితీయేన శంకరాభియుఖీగతా. 24 అన్యా7ల క్తకరాగాఢ్యం పాదంకృత్వా77కులేక్షణా | అనల క్తకమేకంహి హరంద్రష్టుముపాగతా. 25 ఏకేనాక్షాణంజితేనైవ శ్రుత్వాభీమముపాగతమ్ | సాంజనాంచప్రగృహ్యాన్యా శలాకాంసుష్ఠుధావతి. 26 అన్యాసరసనంవాసః పాణినాదాయసుందరీ | ఉన్మత్తేవాగమన్నగ్నాహరదర్శనలాలసా. 27 అన్యాతిక్రాంతమీశానం శ్రుత్వాస్తనభరాలసా | అనిందతరుషాబాలా¸°వనం స్వంకృశోదరీ. 28 ఇత్థంసనాగరస్త్రీణాం క్షోభంసంజనయన్హరః | జగామవృషభారూఢో దివ్యంశ్వశురమందిరమ్. 29 అప్సరసలాడుతుంటే మునులు స్తోత్రాలు చేస్తున్నారు. గంధర్వ గణమంతా శూలపాణి ఫాలాక్షుణ్ణి వెంబడించారు. పదకొండు కోట్ల రుద్రులు, పన్నెండు కోట్ల ఆదిత్యులు, ఎనిమిది కోట్ల వసువులు, అరవై ఏడు కోట్ల గణాలు, ఇరువది నలుగురు ఊర్ధ్వరేతస్కులయిన పరమర్షులు, ఓ నారదా, ఆ పరమ శివుని వెంట నడిచారు. వీరలుగాక ఆ వివాహ యాత్రలో లెక్కకు మిక్కుటమైన యక్ష కిన్నర రాక్షస యూథాలు మహా కోలాహలంగా పాల్గొన్నారు. క్షణ కాలంలో శివుడు తనవార లతో ఆ పర్వతాధిపతి నగర సమీపానికి జేరాడు. ఆ పెండ్లి వారలకు ఎదుర్కోలు చెప్పుటకై పర్వతవీరులు నలువైపుల నుండి ఏనుగులమీద వచ్చి నిలచారు. వరుడు కన్యాదాతకు నమస్కరించగా తక్కిన గిరులన్నీ శివునకు సాగిలబడి లేచి నలచాయి. అందులకు శర్వుడెంతో ఆనందించాడు. అలా తన పార్షదులతో దేవతలతో మహావైభవంగా, నందీశ్వరుడు దారి చూపగానే శైలరాజు పట్టణంలో ప్రవేశించాడు. పెండ్లివారలతో హరుడు నగరంలో ప్రవేశించాడని తెలియగానే పురస్త్రీలంతా తాము చేస్తున్న పనులు ఎక్కడివక్కడ వదలిపెట్టి ఉత్కంఠతో పెండ్లికొడుకును చూచేందుకు బయలుదేరారు. ఒక సుందరి సగం కూర్చిన పూలమాల ఒకచేత్తో పట్టుకొని రెందవచేతితో ముడివేసుకుంటున్ని కేశపాశాన్ని పట్టుకొని శివుని చూచేందుకు ఎదురుగా వచ్చింది. మరొకవనిత ఒక పాదానికి పారణి పెట్టుకొని రెండవ పాదానికి పెట్టకోకుండానే వెళ్ళిచూచింది. మరొక వనిత వన్నెలాడి ఒక కంటికే కాటుక పెట్టుకొని చేతిలో కాటుక తాకపట్టుకొని అలాగే వీథిలోకి వచ్చింది. మరొక తొందరకత్తె పావడా, మొలసూలు చేతులోపట్లుకొని అవిధరించకుండానే మొండిమొలతో పరుగెత్తింది ! ఉరోజాల బరువతో త్వరగా నడవలేక బయలుదేరిన ఎక అవ్వని , పెండ్లికొడుకు తన గుమ్మందాటి వెళ్ళాడని తెలియడంతో తన ¸°వన భారాన్ని నిందించుకుంది. ఈ విధంగా ఆ నగర రమణీ లోకం సంక్షోభాన్ని రేకెత్తిస్తూ ఆ వృషభవాహనుడు మామగారి దివ్యభవనానికి చేరాడు. తతఃప్రవిష్టం ప్రసమీక్ష్యశంభుం శైలేంద్రవేశ్మన్యబలాబ్రువంతి | స్థానేతపోదుశ్చరమంబికాయాశ్చీర్ణంమహానేషసురస్తుశంభుః. 30 స ఏషయేనాంగమనంగతాం కృతం కందర్పనామ్నః కుసుమాయుధస్య | క్రతోఃక్షయీదక్షవినాశకర్తా భగాక్షిహా శూలధరఃపినాకీ. 31 నమోనమఃశంకరశూలపాణ మృగారిచర్మాంబర కాలశ్రతో | మహాహిహారాంకితకుండలాయ నమోనమఃపార్మతివల్లభాయ. 32 ఇత్థంసంస్తూయమానఃసురపతివిధృతేనాతవత్రేణశంభుః సిద్ధ్యైర్వంద్యఃసయక్షైరహికృతవలయీచారుభస్మోపలిప్తః | అగ్రస్థేనాగ్రజేనప్రముదితమనసావిష్ణునాచానుగేన | వైవాహింమంగళాఢ్యాం హుతవహముదితామారురోహాథవేదీమ్. 33 ఆయాతేత్రిపురాంతకే సహచరైఃసార్థంచసప్తర్షిః-ర్వ్యగ్రో7భూద్గిరిరాజవేశ్మని జనఃకాల్యాఃసమాలంకృతౌ వ్యాకుల్యంసముపాగతాశ్చ గిరయఃపూజాదినాదేవతాః ప్రాయోవ్యాకులితాభవంతి సుహృతః కన్యావివాహోత్సుకాః. 34 ప్రసాద్యదేవీంగిరజాంతతఃస్త్రియోదుకూలశుక్లాభివృతాంగయష్ఠికామ్ | భ్రాత్రాసునాభేనతదోత్సవేకృతే సాశంకరాభ్యాశమథోపపాదితా. 35 తతఃశుభేహర్మ్యతలేహిరణ్మయే స్థితాఃసురాఃశకంరకాళిచేష్టితమ్ | పశ్యంతిదేవో7పిసమంకృశాంగ్యా లోకానుజుష్టంపదమాససాద. 36 యత్రక్రీడావిచిత్రాఃసకుసుమతరవోవారణోబిందుపాతై | ర్గంధాఢ్యైర్గంధచూర్ణైఃప్రవిరలమననౌగుండితౌగుండికాయామ్ | ముక్తాదామైఃప్రకామం హరగిరితనయాక్రీడనార్థంతదా7ఘ్నత్ పశ్చాత్సిందూరపుంజైరవిరతవితతై శ్చక్రతుక్ష్మాంసురక్తామ్. 37 ఏవంక్రీడాంహతఃకృత్వా సమంచగిరికన్యయా | ఆగచ్ఛద్దక్షిణాంవేది మృషిభిఃసేవితాందృఢామ్. 38 అథాజగామహిమవాన్ శుక్లాంబరధరఃశుచిః | పవిత్రపాణిరాదాయ మధువర్కమథోజ్ఞ్వలమ్. 39 ఉపవిష్టస్త్రినేత్రస్తు శాక్రీందిశమపశ్యత | సప్తర్షికాంశ్చశైలేంద్రః సూపనవిష్టో7వలోకయన్. 40 సుఖాసీనస్యశర్వస్య కృతాంజలిపటోగిరిః | ప్రోవాచవచనంశ్రీవాన్ ధర్మసాధనమాత్మనః. 41 హిమవానువాచ : మత్పుత్రీంభగవాన్కాళీం పౌత్రీంచపులహాగ్రజే | పితౄణామపి దౌహిత్రీం ప్రతీచ్చేమాంమయోద్యతామ్. 42 పులస్త్య ఉవాచ : ఇత్యేవముక్త్వాశైలేంద్రో హస్తంహస్తేనయోజయన్ | ప్రాదాత్ప్రతీచ్ఛభగవాన్ ఇదముచ్చైరుదైరయన్. 43 ఆ విధంగా గృహంలో అడుగు పెట్టిన శివుని చూచి హిమవంతుని యింటిలోగల యాడువారలు ''ఆహా! ఈ అంబిక చేసిన తపస్సు కడుగొప్పది కదా! ఆ ఫలమే దేవశ్రేష్ఠుడైన ఈ హరుని లభించింది. కుసుమాయుధుడైన మన్మథుణ్ణి అనంగుడుగా చేసినది, దక్షయజ్ఞం ధ్వంసం చేసినది ఈ పినాకియే, శూలపాణియే, సూర్యుని నేత్రాన్ని హరించిన హరుడే !'' అని ఆశ్చర్యపడుచూ ఆ భవుని యిలా స్తుతించారు. ''శంకరా ! త్రిశూలధరా! శూలహస్తా నీకు నమస్సుతు ! వ్యాఘ్రచర్మధరా! మహాసర్పకుండలధరా! నాగేంద్రహారా! పార్వతీరమణా! నీకు ప్రణామ శతమలు!'' అంతఃపురాంగనలావిధంగా స్తోత్రవాక్యాలు పలుకుతూండగా, దేవేంద్రుడు గొడుగుపట్టుకొనగా, సిద్ధయక్షులకు వందనీయుడగునా నాగకంకణుడు, భస్మాలంకృత సర్వాంగుడై, విరించిమనస్సును ప్రమోదభరితం గావిస్తూ విష్ణువు వెంటనంటిరాగా, పవిత్రాగ్నులతో వెలగొందుతున్న వివాహమంగళ వేదికనలంకరించాడు. సపరివారుడై సప్తర్షులతో నేతెంచిన ఆ త్రిపురహరుని చూడగానే అక్కడివారంతా కాళీకుమారిని పెండ్లి కూతురుగా ముస్తాబుచేయుటలో నిమగ్నులయ్యారు. పర్వత ప్రవరులు వచ్చిన పెండ్లివారికి సపర్యలు చేయడంలో హడావుడి పడసాగారు. నిజమేమరి. ఆడపిల్ల పెండ్లిలో పిల్లవైపువారు ఆతుర్దాపడడం సహజమే గదా! అంతఃపురస్త్రీలు పార్వతిని శ్వేతాంబరాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తర్వాత ఆమెసోదరుడు సునాభుడు విహితమైన పూర్వంగకృత్యాలు నెరవేర్చి కాళీని వెంటతబెట్టుకొని శంకరునివద్దకు తీసుకొని వెళ్ళాడు. స్వర్ణనిర్మితమైన ఆ మంగళ##వేదికవద్ద కూర్చొని దేవతలు, వధూవరులు నెరవేర్చదగు వివాహ కృత్యాలు గమనించసాగారు. శివుడు పార్వతితోకలిసి లోకామమోదితాలైన వైవాహికాచారాలు యథాక్రమంగా నెరవేర్చాడు. ఆ సందర్భంలో చిత్రవిచిత్రాలైన వినోదక్రీడలతో, పుష్పభరితాలయిన వృక్షాలతో సుగంధాలు వెదజల్లే (పన్నీరు) జలసేచనాలతో, గంధపు చూర్ణాలు చల్లుకొనడంతో, రంగు రంగుల మ్రుగ్గులతో, ముత్యాలపేరులతోరణాలతో, శివపార్వతుల క్రీడార్థం ఆ ప్రదేశాన్నంతా సిందూర రంజితం గావించారు. ఆ విధంగా గిరకన్యతో క్రీడించి హరుడు ఋషులతో నిండిన దక్షిణ వేదకవద్దకు చేరాడు. చక్కగా నిర్మింపబడిన ఆ దృఢమైన మండపంవద్దకు శ్వేతాంబరాలుధరించి, పవిత్రపాణియై, ఉజ్జ్వల మధుపర్కాలతో హిమవంతుడు వచ్చాడు. పూర్వాభిముఖుడై తినేత్రుడు ఉపవిష్ణుడు కాగా, కన్యాదాత సప్తర్షులవైపు తిరిగి కూర్చున్నాడు. సుఖాసనం మీదనున్న జామాత శర్వునితో, అంజలి ఘటించి ఆ నగపతి ధర్మసమ్మితమైన వాక్యం పతికాడు. ''ఓ దేవా! నాపుత్రిక, పులహుతి అన్నపౌత్రి, పితృదేవతల దౌహిత్రి అయిన ఈ కాళీకన్యను నీకు దత్తం చేస్తున్నాను. పరిగ్రహించినన్ననుగ్రహింపుము. ఓ నారదా! అలా అంటూ ఆ హిమవంతుడు తన కుమార్తెచేతిని హరుని చేతిలో ఉంచి అందరు వినునట్టుగా ''దేవా ! ఈమెను స్వీకరించుడ''ని ఉచ్చైఃస్వరంతో పలికాడు. హరా ఉవాచ : నమే7స్తిమాతానపితాతథైవ నజ్ఞాతయోవా7పినబాంధవాశ్చ | 44 నిరాశ్రయో7హంగిరశృంగవాసీ సుతాంప్రతీచ్ఛామితవాద్రిరాజ ! 44 ఇత్యేవముక్త్వావరదో7వపీడయత్ కరంకరేణాద్రికుమారికాయాః | సాచాపిసంస్పర్శమవాప్యశంభోః వరాంముదంలబ్దవతీమహర్షేః 45 తథాధిరూఢోవరదో7థవేది సహాద్రిపుత్య్రామధుపర్కమశ్నన్ ! దత్వాచలాజాన్కలమన్యశుక్లాం న్తతోవిరించోగిరజామువాచ. 46 కాళిః పశ్యస్వవదనం భర్తుఃశశధరప్రభమ్ | సమదృష్టిఃస్థిరాభూత్వా కురుష్వాగ్నేఃప్రదక్షిణమ్. 47 తతో7ంబికాహరముఖే దృష్టేశైత్యముపాగతా | యథా7ర్కరశ్మిసంతప్తా ప్రావ్యవృష్టిమివావనిః. 48 మాయఃనిభోర్వక్త్రమీక్షస్యేతిపితామహాః | లజ్ఞయాసా7పిదృష్టేతి శ##నైర్బ్రహ్మాణమబ్రవీత్. 49 సమంగిరిజయాతేన హుతాశస్త్రిఃప్రదక్షిణమ్ | కృతోలాజాశ్చహవిషా సమంక్షిప్తాహుతాశ##నే. 50 తతోహరాంఘ్రిత్మాలిన్యా గృహీతోదాయకారణాత్ | కింయాచసిచదాస్యామి ముంచస్వేతిహరో7బ్రవీత్. 51 మాలినీశంకరంప్రాహ మత్పఖ్యాదేహిశంకర | సౌభాగ్యంనిజగోత్రీయం తతోమోక్షమవాస్స్యసి. 52 అథోవాచమహాదేవో దత్తంమాలిన ముంచమామ్ | సౌభాగ్యంనిజగోత్రీయం యో7స్యాస్తం శృణువచ్మితే 53 యో7సౌపీతాంబరధరః శంఖధృక్మధుసూదనః | ఏతదీయోహిసౌభాగ్యో దత్తో7స్మద్గోత్రమేవహి. 54 ఇత్యేవముక్తేవచనే ప్రముమోచవృషధ్వజమ్ | మాలినీ నిజగోత్రన్య శుభచారిత్రమాలినీ. 55 యదాహరోహిమాలిన్యా గృహీతశ్చరణశుభే | తదాకాళీముఖంబ్రహ్మా దదర్శ శశినో7ధికమ్ 56 మద్దృష్ట్వాక్షోభమగమత్ శుక్రచ్యుతిమవాపచ | తచ్ఛుక్రంవాలుకాయాంచ ఖిలీచక్రేససాధ్వసః 57 తతో7బ్రవీద్దరో బ్రహ్మన్ నద్విజాన్హంతుమర్హసి | అమీమహర్షయోధన్యా బాలఖిల్యాఃపితామహ. 58 తతోమహేశవాక్యాంతే సముత్తస్థుస్తవస్వినః | అష్టాశీతిసహస్రాణి వాలఖిల్యాఇతిస్మృతాః. 59 తతోవివాహేనిర్వృత్తే ప్రవిష్టఃకౌతుకంహరః | రేమేసహోమయారాత్రిం ప్రభాతేపునరుత్థితః. 60 తతో7ద్రిపుత్రీంసమవాప్యశంభుః సురైఃసమంభూతగణౖశ్చహృష్టః | సంపూజితఃపర్వతపార్థివేన సమందరంశీఘ్రముపాజగామ. 61 తతస్సురాన్బ్రహ్మ హరీంద్రముఖ్యాన్ ప్రణమ్యసంపూజ్యయథావిభాగమ్| విసర్జభూతైఃనహితోమహీధ్ర మధ్యావసన్మందరమష్టమూర్తిః. 62 ఇతి శ్రీవామనమహాపురాణ సప్తవింశో7ధ్యాయః. శివుడు యిలా అన్నాడు: ''ఓ పర్వతరాజా! నాకు తల్లలేదు. తండ్రిలేడు. జ్ఞాతులు బంధువులంటూ ఎవరూ లేరు. ఇల్లు లేదు. కొండ కొమ్ములమీద తిరుగుతూ ఉంటాను. ఇలాంటి నేను నీ కుమార్తెను స్వీకరిస్తున్నాను.'' అలా చెబుతూ వరదాయకుడైన ఆ శర్వుడు పార్వతిచేతిని గట్టిగాపట్టుకున్నాడు. నారదా! ఆమె కూడ తన భర్తకరస్పర్శరు పులకించిపోయినది. అంతట మధుపర్కప్రాశంనచేసి శివుడు పార్వతితోకలిసి వేదికపైకెళ్ళి లాజలు (బియ్యపు పేలాలు) అర్పించాడు. అపుడు బ్రహ్మ పార్వతితో, ''కాళీ! స్థిరదృష్టితో చంద్రకాంతితో సమంగా వెలుగుచున్న నీ భర్త ముఖాన్ని చక్కగాచూచి అగ్నికి ప్రదక్షిణం చేయుము" అన్నాడు. వేసవికి తపించిపోయిన భూమి తొలకరి వృష్టికి స్పందించినట్లుగా, భర్త ముఖదర్శనంతో అంబిక అపూర్వమైన చల్లదనాన్ని అనుభవించింది. బ్రహ్మ మరలనామెను భర్త ముఖము చూడమనగా నామె చూచితినినని సిగ్గుతోనుడివినది. అంతట గిరిజతో కలిసి హరుడు అగ్నికి ముమ్మారు ప్రదక్షిణంచేసి, హవిస్సులాజలు అగ్నిలో వ్రేల్చాడు. అంతట బహుమతి కోసం మాలిని, శివునికాళ్ళు రెండూ గట్టిగాపట్టుకున్నది. ''నీవడిగినది యివ్వగలను, కాళ్ళు వదలమ''ని అంటున్న హరునితో నామాలిని, ''ప్రభూ! నాయీ చెలికి మీ గోత్ర సౌభాగ్యం యిస్తేకాని మీపాదాలు విడువను" అని అన్నది. "అట్లే యిచ్చితిని మాలినీ యిక నన్ను వదులుము. నా గోత్ర సౌభాగ్యం ఎలాంటిదో చెబుతున్నా వినుము. ఇడుగో, పీతాంబరం ధరించి శంఖంపట్టిన ఈ మధుసూదనుని సౌభాగ్యం. నేను నా గోత్రంగా ప్రసాదించినదే!'' శివుడన్న మాటలు విని, నిజ గోత్ర శుభచరిత్ర శాలియైన ఆ మాలిని, ఆయన కాళ్ళువదలి పెట్టింది. మాలిని శివుని పాదాలు పట్టుకున్న సమయంలో బ్రహ్మ చంద్రునికన్నా మిన్నగా వెలుగుచున్న ఆ కాళి ముఖాన్ని చూచాడు. వెంటనే మారవికారానికి లోనుకాగా అతడి వీర్యం నేలపై పడిపోయింది. దానితో కంగారుపడి ఆయన ఇసుకపైబడినశుక్రాన్ని నిర్వీర్యం గావించాడు. అంతట శివుడు బ్రహ్మతో ''బ్రహ్మ! నీవు బ్రాహ్మణహత్య చేయరాదు సుమా. ఓ పితామహా! ఈవాలఖిల్య మహర్షులు దన్యాత్ముల!'' అన్నాడు. అలా అనగానే, ఎనభై ఎనిమిదివేల ఆవాఖిల్య ఋషులులేచి నిలబడ్డారు. ఆ విధంగా వివాహం సంపన్నం కాగానే హరుడు సంతుష్టుడై ఉమతో కలిసి ఆ రాత్రి యథేష్టసుఖాలనుభవించి ఉదయాన్నే లేచాడు. ఆ విధంగా పార్వతిని వివాహమై హరుడు మిక్కిలిగా సంతోషించాడు. దేవతలు, ప్రమథగణాలుకూడ ఆనందించారు. ఆంతట హిమవంతుని సత్కారాలందుకొని ఆయన మందగిరి తిరిగి వెళ్ళాడు. తన వివాహానికి వచ్చిన బ్రహ్మ విష్ణు యింద్రాది దేవతలను యథావిధిగా సత్కరించి వీడ్కోలు చెప్పినవాడై, ఆ యష్టమూర్తి తన శివగణాలలో మందగిరి మీద నివాస మేర్పరచుకున్నాడు. ఇది శ్రీ వామన మహా పురాణంలో యిరవై యేడవ అధ్యాయం సమాప్తం.