Siva Maha Puranam-3
Chapters
అథ దశమో%ధ్యాయః గోకర్ణ క్షేత్ర మాహాత్మ్యము సూత ఉవాచ | శ్రీమతీక్ష్వాకువంశే హి రాజా పరమధార్మికః | ఆసీన్మిత్రసహో నామ శ్రేష్ఠస్సర్వధనుష్మతామ్ || 1 తస్య రాజ్ఞ స్సుధర్మిష్ఠా మదయంతీ ప్రియా శుభా | దమయంతీ నలస్యేవ బభూవ విదితా సతీ || 2 స ఏకదా హి మృగయాస్నేహీ మిత్ర సహో నృపః | మహద్బలేన సంయుక్తో జగామ గహనం వనమ్ ||3 విహరంస్తత్ర స నృపః కమఠాహ్వం నిశాచరమ్ | నిజఘాన మహాదుష్టం సాధుపీడాకరం ఖలమ్ || 14 అథ తస్యానుజః పాపీ జయేయం ఛద్మనైవ తమ్ | మత్త్వా జగామ నృపతేరంతికం ఛద్మకారకః || 5 తం వినమ్రాకృతిం దృష్ట్వా భృత్యతాం కర్తుమాగతమ్ | చక్రే మహానసాధ్యక్షమజ్ఞానాత్స మహీపతిః || 6 అథ తస్మిన్ వనే రాజా కియత్కాలం విహృత్య సః | నివృత్తో మృగయాం హిత్వా స్వపురీమాయ¸° ముదా || 7 పితుః క్షయాహే సంప్రాప్తే నిమంత్ర్య స్వగురుం నృపః | వసిష్ఠం గృహమానిన్యే భోజయామాస భక్తితః || 8 రక్షసా సూదరూపేణ సమిశ్రితనరామిషమ్ | శాకామిషం పురః క్షిప్తం దృష్ట్వా గురురథాబ్రవీత్ || 9 సూతుడు ఇట్లు పలికెను- శోభాయుక్తమగు ఇక్ష్వాకువంశములో మహాధార్మికుడు, ధనుర్ధారులందరిలో శ్రేష్ఠుడు అగు మిత్రసహమహారాజు ఉండెను (1). నలునకు దమయంతి వలె ఆ రాజునకు గొప్ప ధర్మాత్మురాలు, ప్రియురాలు, శుభకరురాలు, పతివ్రతయని ప్రఖ్యాతిని గాంచినది అగు మదయంతి భార్య ఆయెను (2). ఒకనాడు వేట యందభిరుచిగల ఆ మిత్రసహమహారాజు గొప్ప సైన్యమును వెంటనిడుకొని దట్టమగు అడవిలోనికి వెళ్లెను (3). ఆ మహారాజు ఆ అడవిలో విహరిస్తూ మహాపాపి, సాధువులకు పీడను కలిగించువాడు, దుష్టుడు అగు కమఠాసురుని సంహరించెను (4). తరువాత పాపియగు వాని సోదరుడు ఆ మహారాజును మోసముచే జయించవలెనని నిశ్చయించి మారువేషముతో ఆయన వద్దకు వెళ్లెను (5). ఆ మహారాజు వినయవిధేయతలతో సేవను చేయుటకు వచ్చిన ఆ వ్యక్తిని గాంచి విషయము తెలియని వాడగుచే వానిని వంటశాలకు అధిపతిగా నియమించెను (6). తరువాత ఆ మహారాజు కొద్ది రోజులు ఆ అడవిలో విహరించిన పిదప వేటను విడిచిపెట్టి ఆనందముతో తన నగరమునకు తిరిగి వచ్చెను (7). తండ్రి మరణించిన తిథి వచ్చినప్పుడు ఆ రాజు తన గురువగు వసిష్ఠుని ఆహ్వానించి భక్తితో భుజింపజేసెను (8). వంటవాని రూపములో నున్న ఆ రాక్షసుడు కూరలో నరమాంసమును కలిపి వడ్డించెను. దానిని చూచి గురువు ఇట్లు పలికెను (9).గురురువాచ | ధిక్ త్వాం నరామిషం రాజంస్త్వయైతచ్ఛద్మకారిణా | ఖలేనోపహృతం మహ్యం తతో రక్షో భవిష్యసి || 10 రక్షఃకృతం చ విజ్ఞాయ తదైవం స గురుస్తదా | పునర్విమృశ్య తం శాపం చకార ద్వాదశాబ్దికమ్ || 11 స రాజానుచితం శాపం విజ్ఞాయ క్రోధమూర్ఛితః | జలాంజలిం సమాదాయ గురుం శప్తుం సముద్యతః || 12 తదా చ తత్ర్పియా సాధ్వీ మదయంతీ సుధర్మిణీ | పతిత్వా పాదయోస్తస్య శాపం తం హి న్యవారయత్ || 13 తతో నివృత్త శాపస్తు తస్యా వచన గౌరవాత్ | తత్యాజ పాదయోరంభః పాదౌ కల్మషతాం గతౌ || 14 తతః ప్రభృతి రాజాభూత్స లోకే%స్మిన్ మునీశ్వరాః | కల్మాషాంఘ్రిరితి ఖ్యాతః ప్రభావాత్తజ్జలస్య హి || 15 రాజా మిత్రసహశ్శాపాద్గురో ఋషివరస్య హి | బభూవ రాక్షసో ఘోరో హింసకో వనగోచరః || 16 గురువు ఇట్లు పలికెను- ఓ రాజా! నీకు నిందయగుగాక! మోసగాడైన ఈ దుష్టునిచే నీవు నాకు నరమాంసమును వడ్డింప జేసితివి గాన, నీవు రాక్షసుడవు కమ్ము (10). అపుడా గురువు మరల ఆలోచించి ఇదంతా రాక్షసుని పనియని గుర్తించి ఆ శాపమును పన్నెండు సంవత్సరముల వ్యవధి కలదిగా చేసెను (11). తనకు ఆ శాపము తగదని భావించి ఆ రాజు కోపముచే ఆవేశించబడినవాడై చేతిలో నీటిని తీసుకొని గురువును శపించుటకు సంసిద్ధుడాయెను (12). అపుడు గొప్ప ధర్మాత్మురాలు, సాధ్వి, ఆతని ప్రియురాలు అగు మదయంతి ఆతని పాదములపై పడి ఆ శాపమును ఆపివేసెను (13). ఆమె మాటయందలి గౌరవముచే రాజు శాపమునిచ్చుటను మానివేసి ఆ నీటిని పాదములపై విడిచిపెట్టగా, పాదములు నల్లగా ఆయెను (14). ఓ మహర్షులారా! ఆనాటినుండి ఆ నీటి ప్రభావమువలన ఆ రాజు లోకములో కల్మాషపాదుడను పేరును గాంచెను (15). మిత్రసహ మహారాజు గురువైన మహర్షి యొక్క శాపమువలన అడవిలో తిరుగాడే భయంకర రాక్షసుడై హింసను చేయుచుండెను (16). సబిభ్రద్రాక్షసం రూపం కాలాంతకయమోపమమ్ | చఖాద వివిధాన్ జంతూన్ మానుషాదీన్ వనేచరః || 17 స కదాచిద్వనే క్వాపి రమమాణౌ కి శోరకౌ | అపశ్యదంతకాకారో నవోఢౌ మునిదంపతీ || 18 రాక్షసస్స నరాహారః కిశోరం మునినందనమ్ | జగ్ధుం జగ్రాహ శాపార్తో వ్యాఘ్రో మృగశిశుం యథా || 19 కుక్షౌ గృహీతం భర్తారం దృష్ట్వా భీతా చ తత్ర్పియా | సా చక్రే ప్రార్థనాం తసై#్మ వదంతీ కరుణం వచః || 20 ప్రార్థ్యమానో%పి బహుశః పురుషాదస్స నిర్ఘృణః | చఖాద శిర ఉత్కృత్య విప్రసూనోర్దురాశయః || 21 అథ సాధ్వీ చ సా దీనా విలప్య భృశదుఃఖితా | ఆహృత్య భర్తురస్థీని చితాం చక్రే కిలోల్బణామ్ || 22 భర్తారమనుగచ్ఛంతీ సంవిశంతీ హుతాశనమ్ | రాజానం రాక్షసాకారం సా శశాప ద్విజాంగనా || 23 అద్య ప్రభృతి నారీషు యదా త్వం సంగతో భ##వేః | తదా మృతిస్తవేత్యుక్త్వా వివేశ జ్వలనం సతీ || 24 ఆ రాజు ప్రళయకాలమునందలి మృత్యువును పోలిన రాక్షస రూపమును దాల్చి మనుష్యులను ఇతర జంతువులను భక్షిస్తూ అడవిలో తిరుగుచుండెను (17). ఒకనాడు అడవిలో విహరించుచున్న, కొత్తగా వివాహమై ¸°వనములోనున్న, ఇద్దరు మునిదంపతులను మృత్యువును బోలియున్న ఆ రాక్షసుడు చూచెను (18). శాపపీడితుడై నరమాంసమును భక్షించే ఆ రాక్షసుడు ¸°వనములోనున్న ఆ మునికుమారుని తినుటకై పెద్దపులి లేడిపిల్లను వలె పట్టుకొనెను (19). ఉదరమునందు పట్టుకొనబడిన భర్తను గాంచి ఆతని భార్య భయపడుతూ కరుణతో గూడిన వచనములను పలుకుతూ ఆ రాక్షసుని బ్రతిమిలాడెను (20). నరమాంసభక్షకుడు, దయలేని దుర్మార్గుడు అగు ఆ రాక్షసుని పరిపరి విధముల ఆమె బ్రతిమిలాడిననూ లాభము లేకపోయెను. వాడు ఆ బ్రాహ్మణ కుమారుని తలను పెరికి భక్షించెను (21). అపుడు అతిశయించిన దుఃఖముగల ఆ సాధ్వి దీనముగా విలపించి భర్తయొక్క అస్థికలను సంగ్రహించి భయంకరమగు చితిని ఏర్పాటు చేసెను (22). ఆ బ్రాహ్మణస్త్రీ భర్తను అనుసరించి వెళ్లుటకు నిశ్చయించి అగ్నిలో ప్రవేశించబోతూ రాక్షసరూపములోనున్న ఆ రాజును శపించెను (23). ఈ నాటి నుండి ఏనాడైతే నీవు స్త్రీతో సంగమించెదవో, అపుడు నీకు మృత్యువు కలుగును అని పలికి ఆ పతివ్రత అగ్నిలో ప్రవేశించెను (24). సో%పి రాజా గురోశ్శాపమనుభూయ కృతావధిమ్ | పునస్స్వరూపమాస్థాయ స్వగృహం ముదితో య¸° || 25 జ్ఞాత్వా విప్రసతీ శాపం మదయంతీ రతిప్రియమ్ | పతిం నివారయామాసవైధవ్యాదతి బిభ్యతి || 26 అనపత్యో వినిర్విణ్ణో రాజ్యభోగేషు పార్థివః | విసృజ్య సకలాం లక్ష్మీం వనమేవ జగామ హ | 27 స్వపృష్ఠతస్సమాయాంతీం బ్రహ్మహత్యాం సుదుఃఖదామ్ | దదర్శ వికటాకారాం తర్జయంతీం ముహుర్ముహుః || 28 తస్యా నిర్భద్రమన్విచ్ఛన్ రాజా నిర్విణ్ణమానసః | చకార నానోపాయాన్ స జపవ్రతమఖాదికాన్ || 29 నానోపాయైర్యదా రాజ్ఞస్తీర్థ స్నానాదిభిర్ద్విజాః | న నివృత్తా బ్రహ్మహత్యా మిథిలాం స య¸° తదా || 30 బాహ్యోద్యానగతస్తస్యాశ్చింతయా పరయార్దితః | దదర్శ మునిమాయాంతం గౌతమం పార్థివశ్చ సః || 31 అభిసృత్య స రాజేంద్రో గౌతమం విమలాశయమ్ | తద్దర్శనాప్తకించిత్కః ప్రణనామ ముహుర్ముహుః || 32 అథ తత్పృష్టకుశలో దీర్ఘముష్ణం చ నిశ్శ్వసన్ | తత్కృపాదృష్టి సంప్రాప్త సుఖః ప్రోవాచ తం నృపః || 33 ఆ రాజు గురువుచే విధించబడిన గడువు పూర్తియగు వరకు శాపముననుభవించి మరల తన రూపమును పొంది ఆనందముతో తన ఇంటికి వెళ్లెను (25). బ్రాహ్మణ పత్ని ఇచ్చిన శాపమును గురించి తెలిసి మదయంతి వైధవ్యము వలన చాల భయపడి విహారమునందు ఉత్కంఠ గల భర్తను వారించెను (26). సంతానము లేని ఆ మహారాజు రాజ్యభోగములయందు తీవ్రమగు వైరాగ్యము గలవాడై సంపదనంతనూ విడిచిపెట్టి అడవికి వెళ్లెను (27). ఆ రాజు తన వెనుకనే పలుమార్లు భయపెడుతూ మహాదుఃఖమును కలిగిస్తూ వచ్చుచున్న భయంకరాకారము గల బ్రహ్మ హత్యను గాంచెను (28). నిర్వేదముతో నిండిన మనస్సు గల రాజు బ్రహ్మహత్య నుండి విముక్తిని గోరి జపము, వ్రతము, యజ్ఞము మొదలగు అనేకములైన ఉపాయములనాచరించెను (29). ఓ బ్రాహ్మణులారా! తీర్థస్నానము మొదలగు అనేకములైన ఉపాయముల చేతనైననూ ఆ బ్రహ్మహత్య తొలగి పోలేదు. అపుడా రాజు మిథిలా నగరమునకు వెళ్లెను (30). ఆ మహారాజు అధికమగు చింతతో పీడింపబడుచున్నవాడై మిథిలానగరమునకు బయటనున్న ఉద్యానమునకు చేరి ఎదురుగా వచ్చుచున్న గౌతమమహర్షిని చూచెను (31). ఆ మహారాజునకు గౌతముని చూచిన వెంటనే కొంత సుఖము కలిగెను. ఆయన పవిత్రాంతఃకరణుడగు గౌతముని సమీపించి పలుమార్లు ప్రణమిల్లెను (32). ఆ మహర్షి యొక్క దయతో గూడిన చూపులచే లభించిన సుఖముగల ఆ రాజును ఆయన కుశలప్రశ్నను వేయగా, ఆతడు దీర్ఘమగు వేడి నిట్టూర్పును విడచి ఆయనతో నిట్లనెను (33). రాజోవాచ | మునే మాం బాధతే హ్యేషా బ్రహ్మహత్యా దురత్యయా | అలక్షితా పరైస్తాత తర్జయంతీ పదే పదే || 34 యన్మయా శాపదగ్ధేన విప్రపుత్రశ్చ భక్షితః | తత్పాపస్య న శాంతిర్హి ప్రాయశ్చిత్త సహస్రకైః || 35 నానోపాయాః కృతా మే హి తచ్ఛాంత్యై భ్రమతా మునే | న నివృత్తా బ్రహ్మహత్యా మమ పాపాత్మనః కిము || 36 అద్యమే జన్మసాఫల్యం సంప్రాప్తమివ లక్షయే | యతస్త్వద్దర్శనాదేవ మమానంద భరో%భవత్ || 37 అద్య మే తవ పాదాబ్జ శరణస్య కృతైనసః | శాంతిం కురు మహాభాగ యేనాహం సుఖమాప్నుయామ్ || 38 రాజు ఇట్లు పలికెను- ఓ మునీ! తండ్రీ! దాటశక్యము కానిది, ఇతరులకు కానరానిది, అడుగడుగునా బెదిరించునదియగు ఈ బ్రహ్మహత్య నన్ను బాధించుచున్నది (34). నేను శాపోపహతుడనై బ్రాహ్మణకుమారుని భక్షించితిని. లెక్కలేనన్ని ప్రాయశ్చిత్తములను చేసియూ ఆ పాపము ఉపశమించలేదు (35). ఓ మహర్షీ: నేను సర్వత్రా తిరిగి అనేకములగు ఉపాయములననుష్ఠించితిని పాపాత్ముడనగు నాకు ఈ బ్రహ్మహత్య తొలగిపోదా యేమి? (36) ఈ నాడు నీ దర్శనముచే నా జన్మ సఫలమైనదని నాకు తోచుచున్నది. నాకు గొప్ప ఆనందము కలిగినది (37). పాపాత్ముడనగు నేను నీ పాదపద్మములను శరణు జొచ్చుచున్నాను. ఓ మహాత్మా! నేను సుఖమును పొందే విధముగా శాంతిని చేయుము (38). సూత ఉవాచ | ఇతి రాజ్ఞా సమాదిష్టో గౌతమః కరుణార్ద్రధీః | సమాదిదేశ ఘోరాణామఘానాం సాధు నిష్కృతిమ్ || 39 సూతుడిట్లు పలికెను- రాజు ఇట్లు ప్రార్థించగా కరుణతో ఆర్ద్రమైన హృదయము గల గౌతముడు భయంకరమగు పాపములకు మంచి నిష్కృతిని ఉపదేశించెను (39). గౌతమ ఉవాచ | సాధు రాజేంద్ర ధన్యో%సి మహాఘేభ్యో భయం త్యజ | శివే శాస్తరి భక్తానాం క్వ భయం శరణౖషిణామ్ || 40 శృణు రాజన్మహాభాగక్షేత్రమన్యత్ర్పతిష్ఠితమ్ | మహాపాతకసంహారి గోకర్ణాఖ్యం శివాలయమ్ || 41 తత్ర స్థితిర్న పాపానాం మహాద్భ్యో మహతామపి | మహాబలాభిధానేన శివస్సన్నిహితస్స్వయమ్ || 42 సర్వేషాం శివలింగానాం సార్వభౌమో మహాబలః | చతుర్యుగే చతుర్వర్ణ సర్వపాపాపహారకః || 43 పశ్చిమాంబుధి తీరస్థం గోకర్ణం తీర్థముత్తమమ్ | తత్రాస్తి శివలింగం తన్మహాపాతకనాశకమ్ || 44 తత్ర గత్వా మహాపాపా స్స్నాత్వా తీర్థేషు భూరిశః | మహాబలం చ సంపూజ్య ప్రయాతాశ్శాంకరం పదమ్ || 45 తథా త్వమపి రాజేంద్ర గోకర్ణం గిరిశాలయమ్ | గత్వా సంపూజ్య తల్లింగం కృతకృత్యత్వమాప్నుయాః || 46 తత్ర సర్వేషు తీర్థేషు స్నాత్వాభ్యర్చ్య మహాబలమ్ | సర్వపాపవినిర్ముక్త శ్శివలోకం త్వమాప్నుయాః || 47 గౌతముడిట్లు పలికెను- ఓ రాజేంద్రా! సాధు. నీవు ధన్యుడవు. మహాపాపముల వలని భయమును విడనాడుము. శాసకుడగు శివునియందు శరణాగతి చేసిన భక్తులకు భయమెక్కడిది? (40). ఓ రాజా! మహాత్మా! వినుము. మహాపాపములను పోగొట్టునది, శివునకు నివాసస్థానము అగు గోకర్ణమనే మరియొక క్షేత్రము ప్రతిష్ఠను గాంచియున్నది (41). పెద్దవాటిలో పెద్దవియగు పాపములు కూడ అక్కడ మనజాలవు. అచట మహాబలుడను పేరుతో శివుడు స్వయముగా సన్నిహితుడై యున్నాడు (42). నాల్గు వర్ణముల వారి పాపములన్నిటినీ పోగొట్టే మహాబలుడు నాల్గు యుగములలో శివలింగములన్నింటికీ సార్వభౌముడు (43). గోకర్ణమనే ఉత్తమమగు పుణ్యక్షేత్రము పశ్చిమ సముద్ర తీరమునందు గలదు. మహాపాతకములను నశింప జేయు ఆ శివలింగము అచ్చటనే గలదు (44). మహాపాపాత్ములగు వారు అనేకులు అచటకు వెళ్లి తీర్థములయందు స్నానము చేసి మహాబలేశ్వరుని చక్కగా పూజించి శంకరుని ధామమును చేరిరి (45). ఓ రాజేంద్రా! అదే తీరున నీవు కూడా గోకర్ణములోని శివుని ఆలయమునకు వెళ్లి ఆ లింగమును శ్రద్ధగా పూజించి కృతకృత్యుడవు కమ్ము (46). అచటగల తీర్థములన్నింటి యందు నీవు స్నానము చేసి మహాబలేశ్వరుని ఆరాధించి పాపములన్నింటి నుండి విముక్తుడై శివలోకమును పొందుము (47). సూత ఉవాచ | ఇత్యాదిష్టస్స మునినా గౌతమేన మహాత్మనా | మహాహృష్టమనా రాజా గోకర్ణం ప్రత్యపద్యత || 48 తత్ర తీర్థేషు సుస్నాత్వా సమభ్యర్చ్య మహాబలమ్ | నిర్ధూతా శేషపాపౌ%ఘోలభచ్ఛంభోః పరం పదమ్ || 49 య ఇమాం శృణుయాన్నిత్యం మహాబలకథాం ప్రియామ్ | త్రిసప్తకులజైస్సార్ధం శివలోకే వ్రజత్యసౌ || 50 ఇతి వశ్చ సమాఖ్యాతం మాహాత్మ్యం పరమాద్భుతమ్ | మహాబలస్య గిరిశలింగస్య నిఖిలాఘహృత్ || 51 ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం గోకర్ణక్షేత్ర మాహాత్మ్యవర్ణనం నామ దశమో%ధ్యాయః (10). సూతుడిట్లు పలికెను- మహాత్ముడగు గౌతమముని ఇట్లు ఆదేశించగా, ఆ రాజు మహానందముతో నిండిన మనస్సు గలవాడై గోకర్ణమును చేరెను (48). అచట ఆతడు తీర్థములలో చక్కగా స్నానమును చేసి మహాబలేశ్వరుని అర్చించి కడిగివేయబడిన సకల పాపసమూహములు గలవాడై శంభుని పరమపదమును పొందెను (49). ఎవడైతే ప్రీతికరమగు ఈ మహాబలేశ్వరకథను నిత్యము వినునో, వాడు ఇరవై ఒక్క తరముల స్వవంశీయులతో బాటు శివలోకమును పొందును (50). మహాబలేశ్వరుడను పేర వెలసిన శివలింగము యొక్క సర్వపాపములను పోగొట్టే అత్యద్భుత మాహత్మ్యమును మీకీ తీరున చక్కగా చెప్పియుంటిని (51). శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు గోకర్ణక్షేత్ర మాహాత్మ్య వర్ణనమనే పదియవ అధ్యాయము ముగిసినది (10).