48. త్యాగానికి తక్షణ ఫలం
ఆ సమీపంలో ఉన్న ఒక గొల్లకులస్తుడు తనకున్న కొద్దిపాటి భూమి మొత్తం అమ్మివేసి, శ్రీవారికి సమర్పించ దలచి, స్వామికి తన ఉద్దేశం తెలియజేశాడు. ఆ పని చెయ్యకుండా అతనిని వారించడానికి స్వామి ఎంతో ప్రయత్నించారు. అయినా, అతడు తన నిర్ణయం మార్చుకోలేదు. తన కున్న చారెడు భూమినీ ఒక ధనవంతునికి అమ్మివేసి, ఆ డబ్బు తెచ్చి స్వామికి మనః పూర్వకంగా సమర్పించుకున్నాడు.
అతడు నిరాధారుడు కావడం స్వామికి ఎంతమాత్రం ఇష్టంలేదు. అందు చేత, స్వామి వెంటనే ఆ తాలూకా తహశిల్దారును పిలిపించి, ఆ ప్రాంతంలో ఉన్న పోరంబోకు భూమిలో తగుమాత్రం భూమిని ఆ గొల్ల ఆసామి పేర పెట్టించారు!
మహాకవి ఎవరు?
ఎవరి గ్రంథాలు కాలగర్భంలో విస్మృతములు కాక, చిరంజీవములై ఉంటాయో, అతడు మహాకవి!