Varahamahapuranam-1
Chapters
త్రింశదధిక శతతమో೭ధ్యాయః - నూటముప్పదియవ అధ్యాయము శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవుడు చెప్పెను. దన్త కాష్ఠ మఖాదిత్వా యో హి మా ముపసర్పతి, పూర్వకాలకృతం కర్మ తేన చైకేన నశ్యతి.
1 ఉదయమున పలుదోముపుల్ల నుపయోగింపక (పండ్లు తోముకొనక) నా కడకు వచ్చువాని పూర్వపుణ్య మంతయు ఆ ఒక్కపాపముతో నశించును. నారాయణవచః శ్రుత్వా పృథివీ ధర్మసంస్థితా, విష్ణుభక్త సుఖార్థాయ హృషీకేశ మువాచ హ.
2 నారాయణుని మాట విని ధర్మమునందు నిలుకడ గల భూదేవి విష్ణుభక్తుల సుఖముకొరకై విష్ణువుతో నిట్లు పలికెను. ధరణ్యువాచ - ధరణి పలికెను. సర్వకాలకృతం కర్మ క్లేశేన మహతానఘ, కథ మేకాపరాధేన సర్వ మేవ ప్రణశ్యతి,
3 ఎంతో కష్టపడి సంపాదించిన సర్వకాలసంబంధమగు పుణ్యమంతయు ఒక్క తప్పుతో ఎట్లు నశించును? శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను. శృణు సుందరి తత్త్వేన కథ్యమానం మయా೭నఘే, యేన చైకాపరాధేన పూర్వకర్మ ప్రణశ్యతి.
4 సుందరీ! ఒక్క తప్పుచేత పూర్వపుణ్య మంతయు ఎట్లు నశించునో నేను చెప్పెదను. వినుము. మనుష్యః కిల్బిషీ భ##ద్రే కఫపిత్తసమన్వితః, పూయశోణిత సంపూర్ణం దుర్గన్థి ముఖమస్య తత్. 5 మనుష్యుడు సహజముగా దోషములు కలవాడు. కఫము, పిత్తములతో కూడినవాడు. కుళ్ళిన రక్తముతో నిండిన ఆతని ముఖము చెడువాసన కలదియై యుండును. న సహే దుచితం దేవి దన్తకాష్ఠస్య భక్షణాత్, శుద్ధిం భాగవతీం చైవ ఆచారేణ వివర్జితామ్. 6 పలుదోముపుల్లను వాడుటవలన, ఆదోషము నిలువదు. ఆచారము వదలిని భక్తునికి శుద్ధి కలుగును. ధరణ్యువాచ - ధరణి యిట్లనెను. దన్తకాష్ఠ మఖాదిత్వా యః కర్మాణి కరోతి తే, ప్రాయశ్చిత్తం చ మే బ్రూహి యేన ధర్మం న నశ్యతి. 7 పలుదోముపుల్లను నమలక నీ పూజాకర్మముల నాచరించు వానికి ప్రాయశ్చిత్తమేమి? దేవనివలన నాతని ధర్మము నశింపకుండును? నాకు చెప్పుము. శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహ దేవు డిట్లు పలికెను. ఏవ మేత న్మహాభాగే యన్మాం త్వం పరిపృచ్ఛసి, కథయిష్యామి తే హీదం యథా శుద్ధ్యన్తి మానవాః. 8 పుణ్యాత్మురాలా! నీవు నన్నడిగినదానికి సమాధానముగా మానవు లెట్లు శుద్ధి పొందుదురో చెప్పెదను. ఆకాశశయనం కృత్వా దినాని ద్వే చ పఞ్చ చ, అభుక్త్వా దన్తకాష్ఠస్య ఏవం శుద్ధ్యతి మానవః. 9 ఏడుదినములు ఆకాశశయనము చేసినచో పలుదోమని పాపమునుండి మానవుడు శుద్ధి పొందును. య ఏతేన విధానేన ప్రాయశ్చిత్తం సమాచరేత్, న తసై#్య వాపరాధో೭స్తి ఏవ మేవ న సంశయః. 10 ఈ విధానముతో ప్రాయశ్చిత్తమొనరించిన వానికి దోషము కలుగదు. సంశయము లేదు. ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రింశదిధిక శతతమో೭ధ్యాయః ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పదియవ అధ్యాయము